English | Telugu

వాళ్ళిద్దరితో మాల్దీవ్స్ వెళ్లిన సుమ

కొవిడ్ టైమ్‌లో మాల్దీవ్స్ ఫుల్ ఫేమస్ అయ్యింది. లాక్‌డౌన్ రిస్ట్రిక్షన్స్ నుండి రిలీఫ్ రావడమే ఆలస్యం సెలబ్రిటీలు అందరూ మాల్దీవ్స్ క్యూ కట్టారు. అప్పుడు వాళ్లపై విమర్శలు కూడా వచ్చాయి. ఓ పక్క ప్రజలు ప్రాణాల కోసం పరుగులు తీస్తుంటే విహారయాత్రలు ఏంటని మాల్దీవ్స్ వెళ్లిన సెలబ్రిటీలపై సహచర నటీనటులు ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. అప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయి. సాధారణ ప్రజలు కూడా విహారయాత్రలకు వెళుతున్నారు. యాంకర్ సుమ కూడా వెళ్లారు.

ప్రముఖ తెలుగు టీవీ యాంకర్ సుమ మాల్దీవ్స్ వెళ్లారు. కుమారుడు రోషన్ కనకాల, కుమార్తె స్నేహ మనస్వి కానుకలతో కలిసి ప్రముఖ పర్యాటక సముద్రతీర ప్రాంతానికి వెళ్లారు. ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారు. సుమ చాలా బిజీ యాంకర్. పలు షోస్ చేస్తున్నారు. అయితే.. కరోనా తర్వాత ఎక్కడికి వెళ్లలేదని, కాస్త రిలీఫ్ కోసం షార్ట్ బ్రేక్ తీసుకున్నారని టీవీ ఇండస్ట్రీ టాక్. సుమ, పిల్లలతో పాటు రాజీవ్ కనకాల వెళ్లారో లేదో మరి! పిల్లలతో కలిసున్న ఫొటోలను మాత్రమే సుమ షేర్ చేశారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.