English | Telugu

శ్రీముఖి ఇంట విషాదం

ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి ఇంట విషాదం చోటు చేసుకుంది. సోమవారం ఆమె అమ్మమ్మ మరణించారు. దాంతో శ్రీముఖి భావోద్వేగానికి లోనయ్యింది. అమ్మమ్మతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది.

"అమ్మమ్మ అంటే ప్రేమ. జీవితంలో చాలా విషయాలను తను నాకు చెప్పింది. అమ్మమ్మ ఎప్పుడూ హుషారుగా ఉండేది. ఎల్లప్పుడూ సంతోషాన్ని పంచేది. అమ్మమ్మ ధైర్యవంతురాలు. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. తనతో పాటలు పాడటం, డాన్స్ చేయడం మిస్ అవుతాను. అమ్మమ్మ... ఐ లవ్యూ. జీవితంలో నువ్వు ఇచ్చిన ప్రతి దానికి థాంక్స్. నా జీవితంలో నేను విన్న అత్యుత్తమ ప్రేమ కథల్లో అమ్మమ్మ, తాతయ్య ప్రేమకథ ఒకటి. పైలోకంలో తాతయ్యను అమ్మమ్మ కలుస్తుందని, వాళ్ళ ప్రేమకథ అక్కడ కొనసాగుతుందని ఆశిస్తున్నా" అని శ్రీముఖి రాసుకొచ్చింది.

శ్రీముఖి అమ్మమ్మ మరణానికి సంతాపం తెలుపుతూ పలువురు ప్రముఖులు సందేశాలు పెట్టారు. ఉత్తేజ్ సతీమణి పద్మావతి మరణం మరువక ముందే పరిశ్రమకు చెందిన మ‌రో కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.