English | Telugu

శ్రీముఖి తన చెల్లికి స్వయంవరం ప్రకటించింది!

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" ఈ వారం ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఇందులో కాష్ తీసుకొచ్చే టాస్క్ లో "నాగపంచమి" సీరియల్ టీం గెలిచింది. దాంతో ఓడిపోయిన "మధురానగరిలో" సీరియల్ టీంకి పెళ్లి సంబంధం చూసే ఒక టాస్క్ ఇచ్చింది. ఇక ఈ సీరియల్ లో రాధ క్యారెక్టర్ లో చేసే నటించిన కీర్తి భట్ పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటుంది కాబట్టి శ్రీముఖి తన చెల్లెలు ఫైమాకి పెళ్లి చేయడం కోసం స్వయంవరం ప్రకటించింది. అలా రాధ స్టేజి మీదకు వచ్చింది..." వందకు పైగా సంబంధాలు చూసారని విన్నాను..నా చెల్లికి కూడా పెళ్లి చేసి 101 వ సంబంధం చూడాలని కోరుకుంటున్న" అని శ్రీముఖి చెప్పేసరికి "ఏమిటి నీకు ఇంత వరకు పెళ్లి కాలేదా" అని అవినాష్ ఫైమాని ఏడిపించాడు "ఇప్పటి వరకు నాకు ఒక్క పెళ్లి కూడా కాలేదు" అని ఫైమా వాగేసరికి రాధ మధ్యలో వచ్చి "ఒక్క పెళ్లే చేసుకుంటారు వంద పెళ్లిళ్లు చేసుకోరు" అని చెప్పింది.

ఐతే "నా చెల్లికి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలో చెప్తుంది రాధ గారు మీరు వినండి" అంది శ్రీముఖి " నన్ను చిన్నపిల్లలా చూసుకోవాలి" అని ఫైమా అనడంతో "సరే మంచి మ్యాచ్ వస్తే ఫిక్స్ చేసి నన్ను పిలవండి అని చెప్పి శ్రీముఖి వెళ్ళిపోయింది. తర్వాత మధురానగరిలో సీరియల్ హీరో శ్యామ్ స్టేజి మీదకు వచ్చేసరికి అతన్ని చూస్తూ తెగ సిగ్గు పడిపోతూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్న ఫైమాను రాధా వెనక్కు లాక్కొచ్చింది. "పరాయి పురుషుడిని చూడొద్దని మా అక్క చెప్పింది" అనేసరికి అప్పుడు శ్రీముఖి "రాధ మీరు మీ తమ్ముడు పక్కకి వెళ్తే శ్యామ్, ఫైమా మాట్లాడుకుంటారు" అంది. "అక్క చూడు ఎంత హైట్ ఉన్నాడో" అనేసరికి "శ్యామ్ నీకు సెట్ కాదు మోక్ష సెట్ అవుతాడు అని రాధ అతనితో సంబంధాన్ని క్యాన్సిల్ చేస్తుంది..నాకు ఎవరైనా ఓకే" అంది ఫైమా తన నిర్ణయం చెప్పడంతో ఇక మోక్ష స్టేజి మీదకు రావడంతో అతనితో పెళ్లి చేసింది. "రాధా గారు ఫైనల్లీ మంచి సంబంధం సెట్ చేశారు" అని చెప్పి ఆ స్వయంవరం టాస్క్ ని కంప్లీట్ చేసింది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.