Read more!

English | Telugu

సినిమా రేంజ్‌లో సస్పెన్స్... ఆ అజ్ఞాతవాసి అతడేనా?

స్టార్ మాటీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ కి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. వసుధార, రిషి లవ్ స్టోరీ కి కనెక్ట్ అయిన ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. ఇప్పటివరకు ఈ సీరియల్ లో.. రిషి, వసుధారల లవ్ స్టోరీ పై కథ సాగుతుండగా.. వారిమధ్యలో గొడవలు అవుతూ మళ్ళీ దగ్గరవుతూ.. ఇలా కాస్త దూరం పెరిగి అన్ని సర్దుకుంటున్నాయి. అయితే జయచంద్ర రాకతో వసుధార రిషి ల మధ్య మనస్పర్థలు తొలగిపోయి కథ పెళ్ళి వరకు వచ్చింది. పెళ్ళి జరుగుతుందని అనుకునేలోపు శూన్యమాసమని దేవయాని చెప్పడంతో వీరిద్దరి పెళ్లికి అడ్డుపడినట్టైంది. ప్రస్తుతం రిషి, వసుధారలు ఒకే ఇంట్లో ఉంటూ కాలేజీ పనులు చూసుకుంటున్నారు.

ఈ సీరియల్ లో హీరో హీరోయిన్ లు కలిసిపోయారు. ఇక కథని సుకాంతం చేస్తారనే టైంకి సీరియల్  సరికొత్త మలుపు తిరిగింది. ఇంకో విలన్ ఎంట్రీ ఇచ్చాడు. అతడే సౌజన్య రావు.. నిజానికి అతని బాస్ వేరే ఉన్నాడు. ఇప్పటివరకు అతని బాస్ ఎవరని ఫేస్ ని రివీల్ చెయ్యలేదు ఈ సీరియల్ మేకర్స్. సౌజన్యరావు వెనకాల ఉండి కథ నడిపించేది అతని బాస్. సౌజన్యరావు మెడికల్ కాలేజీ విషయంలో ఛాలెంజ్ లో ఓడిపోయి మొహం చెల్లక.. అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు ఈ సీరియల్ లో మరొక విలన్ క్యారెక్టర్ ఎంట్రీ జరిగింది. తాజాగా వచ్చిన ప్రోమోలో ఒక వ్యక్తి టాక్సీ లో వెళ్తుంటాడు. ఆ టాక్సీ డ్రైవర్ ఒకతనికి యాక్సిడెంట్ చేయగా అతను కింద పడిపోతాడు. టాక్సీ డ్రైవర్ హాస్పిటల్ కి తీసుకెళ్దామ్ సర్ అని వెనకాల కూర్చొన వ్యక్తిని అడగ్గానే అక్కర్లేదు పదా అని ఆ అజ్ఞాతవ్యక్తి అంటాడు. టాక్సీ బయలుదేరి వెళ్తుండగా వెనకాలే వస్తున్న వసుధార ఇదంతా గమనించి..  స్కూటీ పై పడిపోయి ఉన్న వ్యక్తిని చూసి‌.. ఆ టాక్సీ కంటే ముందుగా వెళ్ళి టాక్సీకి అడ్డుగా  స్కూటీని పెడుతుంది. హాస్పిటల్ కి తీసుకెళ్లండని వారికి చెప్తుంది. అప్పుడు టాక్స్ లో నుండి దిగిన ఆ అజ్ఞాతవ్యక్తి కోపంగా మాట్లాడతాడు. "నేనెవరో నీకు తెలుసా.. ఇంకెప్పుడు నా కంటపడొద్దు.. కనిపిస్తే నీకే ప్రాబ్లెమ్" అని వసుధారకి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఆ తర్వాత ధరణి డోర్ తియ్యగానే వసు తో గొడవ పడిన ఆ అజ్ఞాతవ్యక్తి బ్యాగ్ తో డోర్ ముందు ఉంటాడు. ధరణి షాక్ అవుతూ అతడినే చూస్తుంది‌. అటుగా వసున్న రిషి కూడా అతడిని చూసి షాక్ అవుతాడు.
 
ఈ ప్రోమోని చూస్తుంటే ఈ సీరియల్ లో ఇప్పటిదాకా లేడీ విలన్ అయిన దేవయాని కొడుకు శైలేంద్ర భూషణ్ అయి ఉంటాడని వీక్షకులు భావిస్తున్నారు. సౌజన్యరావు బాస్ కూడా ఈ శైలేంద్ర భూషణే అయి ఉంటాడేమో అని పలువురు అనుకుంటున్నారు. ఈ సీరియల్ లో వచ్చిన సస్పెన్స్ సినిమా రేంజ్ లో ఉంది. దేవయానితో పాటుగా ఆమె కొడుకు విలనిజం ఇప్పటినుండి ఈ కథలో ఉంటుందా? ఉంటే ఎలా ఉంటుంది.. ఇకనుండి ఈ సీరియల్ ఏ మలుపు తిరగనుందో చూడాలి మరి.