English | Telugu

బిగ్ బాస్ హౌస్ లోకి శ్రీజ దమ్ము..కప్పు తెస్తాను అంటూ ఇన్స్టా పోస్ట్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష పూర్తయిపోయింది. ఇక ఇందులో శ్రీజ దమ్ము హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. "భవిష్యత్తులో ఏమి జరుగుతుందో నాకు తెలియదు కానీ బిగ్ బాస్ అగ్నిపరీక్ష షో నాకు జీవితకాల జ్ఞాపకాలను ఇచ్చింది. ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి అలాగే పాజిటివ్ , నెగెటివ్‌లు కూడా ఉన్నాయి.. కానీ ఇక్కడ జరిగిన ప్రతి క్షణాన్ని నా జీవితాంతం గుర్తుంచుకుంటాను. ఆ రోజు నాకు గ్రీన్ ఇచ్చి, ఎంతో మంది ఆశీస్సులు, ప్రేమను సంపాదించుకెనెకునేలా చేసిన నవదీప్ గారికి థాంక్యూ..ఆయనది మాస్టర్ మైండ్, ఆయనో ఎంటర్‌టైనర్, ఈ షోకి మెయిన్ రోల్ ఆయనే..శ్రీముఖి అక్కా, అసలు మీ శక్తి, మీ చురుకుదనం , మీరు మమ్మల్ని సపోర్ట్ చేసే విధానం వాహ్ అక్కా, వాహ్.. హ్యాండ్స్ డౌన్ ది బెస్ట్ హోస్ట్...ఇక బిందు మాధవి గారూ, ఆడపులి అంతే!!!! ఆమె మాట్లాడే విధానం, ఆమె ప్రోత్సహించే విధానం ..బ్యూటీ విత్ బ్రెయిన్. ఫైనల్ గా అభిజిత్ గారూ, విన్నర్ అంటే..ఆయన పరిశీలనా విధానం బాగుంది. తక్కువగా మాట్లాడడం ఏదైనా చేసి చూపించడం చేస్తారు. అతను ఎం మాట్లాడినా కన్ఫర్మ్ గా దానికి ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉంటుంది. సూటిగా సుత్తి లేకుండా మాట్లాడతారు. అలాగే ఈరోజు వరకు నాకు సపోర్ట్ చేస్తూ ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా థాంక్యూ సో మచ్ అందరికి...ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా...మీ శ్రీజ దమ్ము కప్ తీసుకువస్తుంది ఈసారి" అంటూ అగ్నిపరీక్షలో తన ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని మెసేజ్ చేసింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.