English | Telugu

ముద్దు పెట్టుకున్న అనసూయ... షాక్‌లో హైపర్ ఆది!

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం చిల్డ్రన్స్ డే స్పెషల్ గా ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో మూవీస్ లో, సీరియల్స్ లో నటించే చిన్నపిల్లలతో పాటు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో వచ్చే చిన్నపిల్లలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఇక ఇందులో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు మాస్టర్ ధృవన్ రాజు. ధృవన్ రాజు అంటే తెలియకపోవచ్చు కానీ చిన్న సినిమాగా వచ్చి మంచి హిట్ కొట్టిన సముద్రఖని నటించిన "విమానం" మూవీ పిల్లాడు అంటే యిట్టె తెలిసిపోతుంది. ఇక ఆదిని ఈ కుర్రాడు ఒక రేంజ్ లో ఆడేసుకున్నాడు.

"నువ్వేం చేస్తుంటావ్" అని ఆది అడిగేసరికి "విమానం" అన్నాడు ధృవన్. "ఆ హెలికాప్టర్" ఐతే ఇంటిప్పుడు అన్నాడు ఆది. "నేను నీకంటే గొప్పోడిని" అని ధృవన్ అనేసరికి "నాకంటే గొప్పోడివా ఎలారా" అని ఆది రివర్స్ లో అడిగేసరికి "జబర్దస్త్ లో ఎన్నేళ్లు చేసావ్" అని అడిగేసరికి "జబర్దస్త్ ఏడేళ్ల నుంచి చేస్తున్న" అన్నాడు ఆది. "అనసూయ ఎప్పుడైనా నిన్ను ముద్దు పెట్టుకుందా" అని అడిగాడు ధృవన్ "లేదే" అన్నాడు ఆది. " నేను ఒక్క సినిమానే చేసాను 100 సార్లు ముద్దు పెట్టుకుంది" అన్నాడు ధృవన్. ఇక డ్రామా జూనియర్స్ సీజన్ 6 లో దుమ్ము రేపే పెర్ఫార్మెన్స్ చేసి అందరినీ తనవైపు తిప్పుకున్న లోకేష్ అనే జూనియర్ కూడా ఈ షోకి వచ్చాడు.

"నువ్వెంటి ఇంత అందంగా తయారైవచ్చావ్" అని ఆది అడిగేసరికి "యాంకర్ రష్మీ ఉండగా" అనేసరికి ఐతే అన్నాడు ఆది. "అది కూడా తెలీదారా నీకు, ఎవర్రా నిన్ను శ్రీదేవిలో పెట్టింది" అన్నాడు లోకేష్. ఈ షోలో పిల్లలంతా పోటాపోటీగా అలరించారు. ఆది ఒక్కడే సింగల్ మాన్ షోగా ఈ ఎపిసోడ్ లో కనిపించాడు. నాటీ నరేష్ ని అందరూ కలిసి ఉతికేసి కాసేపు ఫన్ క్రియేట్ చేశారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.