English | Telugu

ఒక లవ్ కోసం...ఈవిడ ఒకడి తోటి ఎఫైర్...


కాకమ్మ కథలు నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ న్యూ ఎపిసోడ్ కి మానస్, సత్య వచ్చారు. "అసలు మీరిద్దరూ ఎలా కలుసుకున్నారో నాకు తెలుసుకోవాలని ఉంది " అంటూ తేజస్విని అడిగింది. "ఒక గొడవ వలన కలిసాం..నువ్వెందుకు వాళ్ళను సపోర్ట్ చేసావ్ అంటూ నన్ను అడిగింది " అని చెప్పాడు మానస్. "వాళ్లంటే ఎవరు" అని అడిగింది తేజు. "పేర్లెందుకులే" అంది సత్య. "ఐతే ఎవరో ఒక కాకి" అంది తేజు. ఇక తర్వాత మానస్ కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. "10 త్ లో 93 , ఇంటర్ లో 98 పర్సెంట్ మార్క్స్ వచ్చాయి. నాకు హీరో అనే మూవీ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశం వచ్చింది. ఇక ఆ సినిమా 13 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి సెలెక్ట్ అయ్యింది. ఆ సినిమాకు నంది అవార్డు వచ్చింది.

నాకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు వచ్చింది." అని చెప్పాడు మానస్. "నా స్టోరీ ఎలా ఫ్లిప్ అయ్యిందంటే ఒక లవ్ కోసం ..ఫైనల్ వాళ్ళ నోటి నుంచి వినిపించిన మాటలు అవే..దాని కారణంగా ఫామిలీలో కొన్ని పరిస్థితులు మారిపోయాయి " అంటూ చెప్పింది సత్య. "ఇంట్లో ఉన్నవాళ్లను తిన్నావా అని కూడా అడగని ఈవిడ ఒకడి తోటి ఎఫైర్ " అంటూ తేజు కూడా ఏదో చెప్పుకొచ్చింది. ఐతే ఇంతకు శ్రీసత్య, తేజు ఎం చెప్పారు అన్నది ఎపిసోడ్ చూసి తెలుసుకోవాలి. ఇక శ్రీసత్య బిగ్ బాస్ 6 ద్వారా ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. కొన్ని షోస్, సీరియల్స్ లో నటించింది. రామ్ పోతినేని అంటే పిచ్చ ఇష్టం. అలాగే కొన్ని మూవీస్ లో సైడ్ రోల్స్ లో నటించింది కూడా. ఇక సత్య మెహబూబ్ తో కలిసి రీల్స్ అవి చేస్తూ ఉంటుంది. అలాగే అంజలి పవన్ వాళ్ళ అమ్మాయి చందమామతో కలిసి కొన్ని కవర్ సాంగ్స్ కూడా చేస్తూ ఉంటుంది సత్య.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.