English | Telugu

పచ్చబొట్టు వేయించుకున్న రాకేష్...ఏడ్చేసిన సుజాత

"శ్రావణ సంతోషాలు" పేరుతో ఈటీవీలో ఒక కొత్త ఈవెంట్ ఈ నెల 20 న ప్రసారం కాబోతోంది. దానికి సంబంధించిన కొత్త ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి హోస్ట్స్ గా శ్యామల, సింగర్ సాకేత్ కొమాండూరి వ్యవహరించారు. పాత, కొత్త కలయికతో నటీనటులంతా కూడా మంచి కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో వచ్చేసారు. "మర్యాదగా చెప్తున్నా ఇక్కడ సీనియర్ దంపతులు ఉన్నారు. మా ఆవిడని చాలా జాగ్రత్తగా, అపురూపంగా చూసుకోవాలి" అని రాకింగ్ రాకేష్ అనేసరికి "అక్కడ చూడండి వాళ్ళ ఆవిడని ఎలా పట్టించుకుంటున్నాడో..మీరు కూడా పట్టించుకోండి" అని ప్రీతినిగమ్ తన భర్త నగేష్ కి చెప్పేసరికి "వాళ్ళ ఆవిడను నేను పట్టించుకుంటే బాగుండదు ప్రీతి" అని అమాయకపు ముఖంతో కౌంటర్ వేసాడు నగేష్. ఇక ఈ షోలో శ్రావణ లక్ష్మి పూజలు, ఆటలు, పాటలు, కామెడీ స్కిట్లు అదరగొట్టాయి. అలాగే ఈ షోలో జబర్దస్త్ కమెడియన్ అప్పి తన భార్యతో కలిసి వచ్చాడు.

తన భార్య ఒకప్పుడు తనను అప్పి వదిలేసి ఇండస్ట్రీకి రావడం గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఈ షోలో వాళ్ళ వాళ్ళ భార్యల కాళ్లకు గోరింటాకు పెట్టారు భర్తలు. ఈ ఈవెంట్ లో ఏక్ నాధ్, హరిణి జోడి వచ్చారు. ఏక్ నాధ్ కోసం "జలజలపాతం నీవు" సాంగ్ పాడి వినిపించింది. ఇక లాస్ట్ లో రాకేష్ తన చేతి మీద పచ్చబొట్టు వేయించుకున్నాడు. "జీవితంలో మంచి చెప్పేవాళ్ళు, బ్యాక్ బోన్ గా ఉంటారు కొంతమంది. అలా నా జీవితంలో సుజాత ఉంది " అని చెప్పాడు. ఇక ఆ పచ్చబొట్టు వేయించుకున్నంత సేపు ఆ బాధను భరించలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు రాకేష్. అది చూసి స్టేజి మీదకు వచ్చిన జోర్దార్ సుజాత ఏడ్చేసింది. "జ్వరం వచ్చినప్పుడు ఇంజక్షన్ వేయించుకోవడానికి అల్లకల్లోలమైపోతాడు...ఆయన నొప్పిని నేను భరించలేను" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇలా శ్రావణ మాసం సందర్భంగా ఒక మంచి డివోషనల్, కామెడీ, ఫన్నీ ఈవెంట్ త్వరలో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతోంది.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.