English | Telugu

బాడీ షేమింగ్ కామెంట్స్ తో ఇబ్బంది పెడుతున్న కమెడియన్స్..షో నుంచి తప్పుకుంటున్న కొత్త యాంకర్!

జబర్దస్త్ దాదాపు పదేళ్లకు పైగా నడుస్తున్న కార్యక్రమం. ఈ కార్యక్రమం మీద ఎన్ని వివాదాలు, తగాదాలు వచ్చినా ఈ షో మాత్రం చక్కగా నడుస్తూ వెళ్తోంది. చాలా మంది వెళ్లిపోవడం రావడం వంటివి జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి.

ఇకపోతే ఈ జబర్దస్త్ లో ఎక్కువగా బాడీ షేమింగ్ డైలాగ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇలాంటి కామెంట్స్ కారణంగా అనసూయ షో నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్లిపోయేసరికి సౌమ్యరావుని రంగంలోకి దింపింది యాజమాన్యం. ఐతే ఇప్పుడు సౌమ్య కూడా షో నుంచి తప్పుకుంటున్నట్టు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. అనసూయ ఏ కారణంతో జబర్థస్త్ ను వీడిందో.. సౌమ్య కూడా అదే కారణంతో జబర్థస్త్ నుంచి తప్పుకుంటుందట. ఈ మధ్య కాలంలో జబర్దస్త్ పై కాంట్రవర్షియల్ కంటెంట్ ఎక్కువైపోతోంది. షో నుంచి బయటకు వెళ్లినవాళ్లు జబర్థస్త్ పై గట్టిగానే విమర్షలు చేస్తున్నారు. అంతేకాదు జబర్దస్త్ లో బాడీ షేమింగ్ కామెంట్స్ కూడా హద్దులు మీరుతున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే.

కొన్ని ఎపిసోడ్స్ బానే చేసిన సౌమ్య మీద హైపర్ ఆది బాడీ షేమింగ్ కామెంట్స్ ఎక్కువైపోయానని తెలుస్తోంది.. అందుకే ఆమె అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకుని మరి షో నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.