Read more!

English | Telugu

'ఢీ-15' స్టేజి మీద పెళ్లి చేసుకున్న శేఖర్ మాస్టర్...అది చూసి ఏడ్చేసిన శ్రద్దా

'ఢీ-15' ఛాంపియన్ షిప్ బ్యాటిల్ ప్రతీ వారం సరికొత్తగా అలరిస్తోంది. ఇందులో ఈ మధ్య శేఖర్ మాస్టర్ వేస్తున్న జోక్స్ మాములుగా ఉండడం లేదు. శ్రద్ధాదాస్ కూడా తగ్గేదేలే అన్నట్టుగా కౌంటర్లు వేస్తోంది, స్టేజి మీద ఆడి పాడుతోంది. లేటెస్ట్ ప్రోమో చూస్తే లవర్స్ డే సందర్భంగా లవ్ థీమ్‌ మీద కంటెస్టెంట్లు డ్యాన్స్ చేశారు. మొదటిగా ఒక కంటెస్టెంట్ వచ్చి 'గీత గోవిందం' మూవీలో డాన్స్ చేస్తుండగా  "వచ్చిందమ్మా వచ్చిందమ్మా" అనే లిరిక్ రాగానే స్టేజ్‌ మీదకు శేఖర్ మాష్టర్ భార్య ఎంట్రీ ఇచ్చారు. ఇది చూసి షాకవడమే కాదు కొంచెం ఎమోషనల్ అయ్యాడు శేఖర్ మాస్టర్.. స్టేజి మీద ఇద్దరూ దండలు మార్చుకుని కాసేపు ప్రేమికులుగా మారిపోయి డాన్స్ చేశారు. మిగతా వాళ్లంతా ఆ ఇద్దరి  మీద పూల జల్లు కురిపించారు.  

శేఖర్ మాష్టర్‌ను ఇంట్లో 'నాని' అని పిలుస్తారని ప్రదీప్ కి చెప్పేసరికి ప్రదీప్ ఆ పేరుతోనే పిలిచి కాసేపు ఫన్ చేసాడు. తర్వాత మరో లేడీ కంటెస్టెంట్.. "తెలుసునా తెలుసునా" అంటూ సొంతం మూవీ సాంగ్ కి డ్యాన్స్ వేసింది. ఆమెతో పాటు యాంకర్ ప్రదీప్ కూడా కొన్ని స్టెప్స్ లో పార్టిసిపేట్ చేసేసరికి శ్రద్ధా దాస్ మాట్లాడుతూ "ప్రదీప్ అక్కడ డ్యాన్స్ చేస్తుంటే వేరే అమ్మాయితో పాటు.. ప్రతి అమ్మాయి జెలస్ ఫీలవుతుంది" అనేసరికి శేఖర్ మాస్టర్ గట్టిగా అరిచేశాడు. ఇక ఫైనల్ గా మరో కంటెస్టెంట్ " ఏ నోము నోచిందో.. ఏ పూజ చేసిందో.. పరమేశ నిను కన్న తల్లి" అంటూ యోగి మూవీలో సాంగ్ కి  ఎమోషనల్‌‌గా డ్యాన్స్ చేస్తున్నప్పుడు బ్యాక్ డ్రాప్ లో  శేఖర్ మాష్టర్ తన తల్లితో ఉన్న ఫొటోను.. అలాగే శ్రద్ధా దాస్ తన అమ్మ, నాన్నలతో ఉన్న చిన్నప్పటి ఫొటోలను ప్లే చేసి చూపించారు. 

శ్రద్ధా అయితే "అది నాకు చాలా ఇష్టమైన ఫొటో.. నేను చాలా ఎమోషనల్ అయ్యాను" అంటూ ఏడ్చేసింది. ఇక ప్రోమో ఎండింగ్ మాత్రం కేక పుట్టించింది. ఈ సాంగ్ కి డాన్స్ చేసిన కంటెస్టెంట్ వాళ్ళ అమ్మ కూడా స్టేజి మీదకు వచ్చి డాన్స్ చేయడం హైలైట్..