English | Telugu

ఈయన ఇన్పుట్స్ ఇస్తారు..ఆయన ఏ స్టెప్ ఐనా వేసేస్తారు

టాలీవుడ్ లో ఇప్పుడున్న స్టార్ కొరియోగ్రాఫర్స్ లో శేఖర్ మాస్టర్ ఒకరు. ఆయన ఏ పాట చేసినా అది సోషల్ మీడియాలో మంచి వ్యూస్ సంపాదించుకుంటాయి. ఇప్పుడు ఆయన కోరియోగ్రఫీ చేసిన చిరంజీవి మూవీ "వాల్తేరు వీరయ్య"..బాలయ్య మూవీ "వీరసింహారెడ్డి" సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి. వీటికి సంబంధించి ఆయన కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

"వాల్తేరు వీరయ్య మూవీలోని ఐదు సాంగ్స్ కి నేనే కోరియోగ్రఫీ చేసాను. చిరంజీవి గారి గ్రేస్ ని దృష్టిలో పెట్టుకుని మరీ స్టెప్స్ ని కంపోజ్ చేసాను. ఎందుకంటే ఆడియన్స్ కి ఆయన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాటిని ఎక్కడ తగ్గించకుండా డాన్స్ కంపోజ్ చేయాలంటే చాలా కష్టం. అందుకే ముందుగా నేను రెండు మూడు వెర్షన్స్ చేసి ఆయనకు చూపిస్తాను. ఆయనకి ఏది నచ్చితే దానితోనే సెట్స్ పైకి వెళతాను. చిరంజీవి గారు కూడా మంచి ఇన్పుట్స్ ఇస్తూనే ఉంటారు." అని అన్నారు.

ఇక బాలయ్య సార్ విషయానికొస్తే, 'వీరసింహా రెడ్డి' లో రెండు సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేసాను. ఆయన గురించి చెప్పక్కర్లేదు..ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఫుల్ ఎనర్జీతో ఉంటారు. ఆయన అభిమానులు ఏం కోరుకుంటారో ఆ విధంగా స్టెప్స్ కంపోజ్ చేయాలి. ఆయన స్టెప్స్ కి విజిల్స్ పడేలా కంపోజ్ చేయాల్సి ఉంటుంది. డాన్స్ కంపోజ్ విషయంలో బాలయ్యగారు చేంజెస్ ఏమీ చెప్పరు. అది ఎలాంటి స్టెప్ అయినా వెనకాడకుండా చేస్తారు. నేను చేసిన భారీ సినిమాలు రెండూ ఒకేసారి రిలీజ్ అవుతుండేసరికి నాలో యాంగ్జైటీ పెరుగుతోంది" అంటూ చెప్పుకొచ్చాడు శేఖర్ మాస్టర్.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.