English | Telugu

షకీ అమ్మగా బిగ్ బాస్ హౌజ్ లోకి షకీల.. మోస్ట్ ఎమోషనల్ జర్నీ!

బిగ్ బాస్ సీజన్-7 గురించి ప్రతీ ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ టైమ్ రానే వచ్చింది. నిన్న రాత్రి (సెప్టెంబర్ 3rd) బిగ్ బాస్ సీజన్-7 తెలుగు ప్రేక్షకులను అలరించడానికి గ్రాండ్ గా లాంచ్ అయింది. అయితే ఇందులోకి వెళ్ళే కంటెస్టెంట్స్ దాదాపు ఇప్పటివరకు మనం చెప్పినట్టుగానే వచ్చేసారు. ఇద్దరు ముగ్గురు మినహా మిగిలిమవాళ్ళంతా మనం ఇప్పటివరకు కన్ఫమ్ కంటెస్టెంట్స్ వీళ్ళే అని చెప్పినవాళ్ళే ఉన్నారు. అయితే ఈ సారి ఉల్టా పల్టా కాబట్టి కాస్త భిన్నంగా ఉంది బిగ్ బాస్. ఎవరూ ఊహించని విధంగా ఈసారి ఉండబోతుందని ప్రోమోలో నాగార్జున చెప్పినట్టుగానే కొత్త రూల్స్, కొత్త టాస్క్ లు వచ్చేశాయి.

బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో షకీల కి ఒక పవర్ ఫుల్AV ని తీర్చిదిద్దారు మేకర్స్. ‌అయితే రెగ్యులర్ కంటెస్టెంట్స్ కి కాస్త భిన్నంగా కొత్త కంటెంట్ కోసం షకీలా ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. షకీలాని పాజిటివ్ గా చూపించడానికి, ఫ్యామిలీ ఆడియన్స్ కి తనని దగ్గర చేయడానికి తను ఎదుర్కున్న పరిస్థితులని, అవమానాలని చూపించారు మేకర్స్. తను ఎన్నో బీ గ్రేడ్ సినిమాల్లో చేసాక తనకి చాలా అవమానాలు ఎదురయ్యాయని చెప్పింది షకీల. డబ్బుల కోసం వాళ్ళ అమ్మ మొదటిసారి షకీలాని అక్కడికి పంపించందంట. అయితే తను అప్పుడు ప్లే గర్ల్స్ అనే పిక్చర్ ఓకే అయిందంట. అదే టైమ్ లో డబ్బులకి ఇబ్బంది అవుతుందని వాళ్ళ అమ్మ పంపించిందంట. వాళ్ళ అక్కతోనే షకీలా వెళ్ళిందని ఒక ఇంటర్వూలో చెప్పింది‌. కాగా ఇలా తను ఇలా అవడానికి కారణమేంటి? ఎందుకిలా జరిగిందని షకీలా చాలాసార్లు చెప్పుకొని బాధపడింది. అయితే తన గురించి ఎవరికి తెలియని కొన్ని నిజాలని చూపిస్తూ, తన ఆఫ్ స్క్రీన్ లైఫ్ ఎలా ఉందని AV లో చూపించారు బిగ్ బాస్ మేకర్స్. షకీల తన గతాన్ని చెప్పుకుంటూ ఎమోషనల్ అయింది. వాళ్ళ అక్క తనని ఎదగనివ్వకుండా చేసిందని, తను సినిమాల్లో చేస్తే వచ్చిన డబ్బులతో ఒక్క ల్యాండ్ కూడా తీసుకోకుండా చేసిందంట. ఎందుకంటే తను(షకీల) రెక్కలొచ్చిన పక్షిలా ఎగిరిపోతుందేమోనని వాళ్ళ అక్క కావాలనే డబ్బులని ఖర్చు చేసిందంట. ఇలా తన గురించి చెప్పుకొచ్చింది షకీల.

అయితే తను కూడా ఒక ఆడదే, తనకి సమాజంలో సరైన గుర్తింపు లేదంటూ సమాజానికి చెప్పేలా తనని ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేయాలని బిగ్ బాస్ టీమ్ ఆలోచిస్తుందని మనకి ఇప్పటికే తెలిస్తుంది. అందుకే ఈ సారి తనని బిగ్ బాస్ లో ఒక సాధారాణ మహిళగా, ఒక అమ్మగా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది షకీల. హోస్ట్ నాగార్జున దగ్గరికి రాగానే షకీల ఎమోషనల్ అయింది. షాషా అండ్ తంగం ఇద్దరు తమ బాబోగోలు చూసుకుంటారని, వాళ్ళిద్దరిని బిడ్డలుగా చూసుకుంటుందంట షకీల. అయితే వాళ్ళిద్దరు స్టేజ్ మీదకి రాగానే ఏడ్చేసింది షకీల. 'బాగా ప్లే చేయండి మీరేంటో మాకు తెలుసని' తంగం చెప్పింది. ట్రాన్స్ జెండర్స్ ని తీసుకొని చేరదీసిందంట షకీల. ఫస్ట్ కూతురు తంగం, రెండో కూతురు షాషా. తనకి ఇక్కడ దేశంలోనే కాకుండా వరల్డ్ నుండి ట్రాన్స్ జెండర్స్ లో అభిమానులున్నారంట. ఆరవ కంటెస్టెంట్ గా షకీలగా ఎంట్రీ ఇచ్చింది. తెరమీద చూసిన షకీల వేరు‌. ప్రస్తుతం ఉన్న ఈమె వేరంటూ నాగార్జున హౌస్ లోకి పంపించాడు. తను ఎంత వరకు హౌజ్ లో ఉండగలుగుతుందో చూడాలి మరి...

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.