English | Telugu

Guppedantha Manasu:కొడుకు డ్రామా హిట్టు.. ఇంటరాగేషన్ ఫట్టు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -946 లో... శైలేంద్రని ఇంటరాగేషన్ చేస్తానని ముకుల్ వస్తాడు. ఈ టైమ్ లో ఎందుకని ఫణీంద్ర అనగానే.. మీరు ఇప్పుడు మీ కొడుకు అని ఆలోచిస్తున్నారా అని ముకుల్ అంటాడు. నేను ముందే చెప్పాను తప్పెవరు చేసిన శిక్ష పడాలి. అది నా కొడుకు అయిన సరే కానీ వాడి సిచువేషన్ బాగాలేదు. కొంచెం టైమ్ తీసుకొని మీ డ్యూటీ చెయ్యండి అని అంటున్నానని ఫణీంద్ర అంటాడు.

మరొకవైపు శైలేంద్ర దగ్గరికి దేవయాని వచ్చి.. తనపై నిజంగానే ఎటాక్ జరిగిందని బాధపడుతు ఉంటుంది. అప్పుడు శైలేంద్ర కళ్ళు తెరిచి చూడగానే.. ప్రశ్నల మీద ప్రశ్నలు దేవయాని అడుగుతుంటుంది. ఎటాక్ చేసింది ఎవరో గానీ కరెక్ట్ గురి చూసి కొట్టారని శైలేంద్ర అనగానే.. దేవయాని తన మాటలతో శైలేంద్రకి చిరాకు తెప్పిస్తుంది. ఆ తర్వాత అసలు విషయం చెప్దామని శైలేంద్ర అనుకుంటాడు. అప్పుడే బయట ఉన్న ముకుల్ ని చూసి మళ్ళీ శైలేంద్ర సైలెంట్ గా పడుకొని ఉంటాడు. ఆ ముకుల్ లోపలికి రాకుండా నేను ఆపుతానంటూ దేవయని బయటకు వెళ్తుంది. ఆ తర్వాత శైలేంద్రని ఇంటరాగేషన్ చేస్తానని ముకుల్ అనగానే.. వద్దు అంటూ దేవయాని అడ్డుపడుతుంది. ఈ సిచువేషన్ లో ఇంటరాగేషన్ ఏంటి? అని దేవయాని అక్కడ ఉన్నవాళ్ళని దబాయిస్తుంటుంది.

ఆ తర్వాత దేవయాని మాటలని ముకుల్ పట్టించుకోకుండా లోపలికి వెళ్లి శైలేంద్రని మాట్లాడించే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత శైలేంద్ర మెల్లిగా ముకుల్ తో మాట్లాడాలని ట్రై చేస్తాడు దాంతో శైలేంద్రకి ముకుల్ వాయిస్ రికార్డు వినిపిస్తానని అనగానే.. మళ్ళీ ఎదో అయినట్లుగా శైలేంద్ర యాక్ట్ చేస్తాడు. దాంతో డాక్టర్ వచ్చి అందరిని బయటకు పంపిస్తాడు. శైలేంద్రపై జరిగిన ఎటాక్ గురించి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తానని, రిషి వస్తే కాల్ చెయ్యమని చెప్పండి అంటూ ముకుల్ వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.