English | Telugu

సీరియల్స్ చేసుకుంటాం బిగ్ బాస్ వద్దు!

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ప్రతీ వారం ఎంతో ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది. రేపు ప్రసారం కాబోయే ప్రోమోని రిలీజ్ అయ్యింది. ఇందులో సీరియల్ స్టార్స్ వెర్సెస్ బిగ్ బాస్ స్టార్స్ మధ్య కాంపిటీషన్ పెట్టింది శ్రీముఖి. ఇక సుహాసిని, ప్రేరణ, నాగపంచమి సీరియల్ హీరో పృద్వి శెట్టి వచ్చారు. ఇక శ్రీముఖి ఒక ప్రశ్న వేసింది "ప్రేరణా ఎప్పుడైనా బిగ్ బాస్ కి వెళ్లాలనిపించిందా" అని. "అనిపిస్తుంది..ఛాన్స్ వస్తే వెళ్తా" అంది ప్రేరణ. "బిగ్ బాస్ కి వెళ్తావా వెళ్ళవా" అంటూ సుహాసినిని అడిగింది "వెళ్తానో లేదో తెలీదు, కానీ వెళ్లాలని ఉంది, వెళ్ళకూడదు అని కూడా ఉంది" అని ట్విస్టింగ్ ఆన్సర్ చెప్పింది. "పృద్వి నీకు బిగ్ బాస్ హౌస్ కి వెళ్లాలని ఉందా" అని అడిగింది శ్రీముఖి. "నాకు బిగ్ బాస్ ని హోస్ట్ చేయాలని ఉంది" అని చెప్పాడు.

ఆ ఆన్సర్ కి అందరూ షాకయ్యారు. "నాగార్జున గారు మీ సీటుకే బొక్కేట్టాడండి" అంటూ శ్రీముఖి లైవ్ లో నాగార్జునకు వినిపించేలా అరిచి మరీ చెప్పింది. తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ స్టేజి మీదకు వచ్చారు. "బిగ్ బాస్ హౌస్ ఆ సీరియల్స్ ఆ" అని శోభా శెట్టిని అడిగింది శ్రీముఖి... "సీరియల్సే" అని బిగ్ బాస్ వద్దు అన్నట్టుగా దణ్ణం పెట్టి చెప్పింది. "సీరియల్సా బిగ్ బాసా" అని అంబటి అర్జున్ ని అడిగేసరికి "రెండు కావాలి" అని కైపుగా చెప్పాడు..."ఎప్పుడూ రెండే రెండే అంటే ఎలారా అయ్యేది" అంది శ్రీముఖి నవ్వుతూ. ఇక ఈ షోలో అందరూ వాళ్ళ వాళ్ళ ఫేసెస్ ని బొమ్మలుగా గీసి చూపించారు. ఇక చివరిలో ఒక మ్యాజిక్ షో జరిగింది. రవికృష్ణ ఒక చిన్న బ్యాగ్ ఇచ్చి శ్రీముఖికి లవ్ ప్రొపోజ్ చేసాడు. ఐతే ఆ బాగ్ లో ఏముందో చూడాలి అంటూ మేజిక్ చేసిన వ్యక్తి అడిగాడు. శ్రీముఖి బాగ్ లో చూసేసరికి అప్పటివరకు రవికృష్ణ చేతికి ఉన్న వాచ్ ఆ బాగ్ లో కనిపించడంతో ఆ మేజిక్ కి అందరూ ఫిదా ఇపోయారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.