Read more!

English | Telugu

నాన్న నీ కల ఈరోజు నిజమయ్యింది...నీ అకౌంట్ కి బ్లూ టిక్ వచ్చేసింది

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఈ ప్రపంచానికి పరిచయం అయ్యారు. అందులో లేడీ కమెడియన్స్ కూడా ఫుల్ ఫేమస్ అయ్యారు...రోహిణి, రీతూ, సత్యశ్రీ, వర్ష ఇలా చాలామంది ఉన్నారు. ఇక రీతూ విషయానికి వస్తే రీసెంట్ గా ఆమె తన నాన్నను పోగొట్టుకున్న విషయం తెలిసిందే. తన నాన్న‌తో మంచి అనుబంధం ఉండడంతో రీతూ చౌద‌రి ఆయన గురించి పెట్టిన ఒక ఎమోష‌న‌ల్‌గా పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. ఇప్పుడు రీతూ వాళ్ళ నాన్నతో కలిసి దిగిన ఫోటోని పోస్ట్ చేసి ఒక కామెంట్ పెట్టింది. 

"నాన్న నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి ఎప్పుడు బ్లూ టిక్ వస్తుంది అని అడిగావు కదా..అది ఈ రోజు నిజమయ్యింది. బ్లూ టిక్ వచ్చేసింది. ఐ లవ్ యు డాడీ..మీరు పై నుంచి నన్ను చూస్తున్నారన్న విషయం నాకు తెలుసు..ఈరోజు నుంచి నేను చాలా కష్టపడి మీ పేరు నిలబెడతాను" అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ ని తన ఇన్స్టా స్టేటస్ లో పెట్టుకుంది. గాయత్రి అలియాస్ రీతూ చౌదరి యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి..సీరియల్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుని ప్రస్తుతం జబర్దస్త్ లో రాణిస్తోంది. ఇంటిగుట్టు సీరియల్ లో ఈమె నటించింది. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లో యాక్ట్ చేయడమే కాదు అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫుల్ ఫేమస్ అయ్యింది ఈ అమ్మడు. అలాగే గతంలో ప్రసారమైన ప్రదీప్ మాచిరాజు పెళ్లి చూపుల కార్యక్రమానికి వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా రీతూ వచ్చింది. కానీ మధ్యలోనే ఆమె ఎలిమినేట్ అయ్యింది.