English | Telugu

గేతో ఎలా ప్రెగ్నన్సీ వస్తుంది...కళ్ళు తెరిచి నిజం తెలుసుకోండి!

సెలెబ్రిటీస్ మీద ఎన్ని గాసిప్స్ వస్తే అంత ఫేమస్ అవుతూ ఉంటారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటారు. ఇక సోషల్ మీడియాలో వచ్చే వార్తలకు ఘాటుగా సమాధానాలిచ్చి కూడా ఫేమస్ అవుతూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు పునర్నవి కూడా అలాగే ట్రెండింగ్ టాపిక్ లోకి వచ్చేసింది. పున్ను అంటే చాలు బిగ్ బాస్ బ్యూటీగా అందరికీ గుర్తొచ్చేస్తుంది. హౌస్ లో ఉన్నన్ని రోజులు రాహుల్ సిప్లిగంజ్ తో చెట్టాపట్టాలేసుకుని కబుర్లు చెప్పింది. ఉయ్యాలా జంపాల మూవీలో కూడా నటించింది.

తర్వాత స్టడీస్ కోసం లండన్ వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళాక ఆమె ఒక అబ్బాయితో చాలా క్లోజ్ గా ఉన్న ఫొటోస్ ని షేర్ చేసేసరికి అతనితో రిలేషన్ లో ఉన్నట్లు భావించారంతా. అలాగే ఆమె పొట్ట కూడా కాస్త ఎత్తుగా కనిపించేసరికి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఈ విషయం మీద ఆమె రెస్పాండ్ అయ్యింది. మామూలు రూమర్స్ ఐతే ఎవరూ పట్టించుకునేది కాదేమో కానీ తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన న్యూస్ అయ్యేసరికి ఆమె చాలా సీరియస్ అయిపోయింది.

"నా గే బెస్టీ వల్ల నాకు గర్భం వచ్చిందని ఒక యూట్యూబ్ వార్త రాసింది. పోయిన నెలలో నేను అనారోగ్యంగా ఉన్న నేను ఈ నెలలో ప్రెగ్నెంట్ ఐపోయాను...లైమ్ లైట్‌లో మీరు చూసేదంతా నిజం కాదు. నిజం మూడు రకాలుగా ఉంటుంది. కళ్ళతో చూసేదే నిజం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతున్నప్పటికీ స్త్రీలను అవమానించే సంస్కృతి బాగా పెరిగిపోతోంది." అంటూ గట్టిగా క్లాస్ ఇచ్చిపడేసింది. ఈ మొత్తాన్ని కూడా పున్ను తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.