English | Telugu

విశ్వనాథ్ తో తన గతం గురించి రిషి చెప్పనున్నాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -865 లో.. రిషికి వసుధార ఫోన్ చేసి మహేంద్ర సర్ వాళ్లకి దెబ్బ తాకిందని చెప్పగానే రిషి కంగారుపడతాడు. సర్ బానే ఉన్నాడు? మీరు ఏం టెన్షన్ పడకండని వసుధార చెప్పి రిషిని రమ్మంటుంది. అదే విషయం లోపలికి వెళ్లి వసు జగతి మహేంద్రలకి.. రిషి సార్ వస్తున్నాడని చెప్తుంది.

ఆ తర్వాత మహేంద్రని చూసిన రిషి.. ఎలా ఉన్నారని అడుగుతాడు. మేడమ్ మీరు ఎలా ఉన్నారని అడగకుండా‌‌ జగతి గురించి కూడా మహేంద్ర నఢ అడుగుతాడు రిషి. బాగున్నాం రిషి, నువ్వేం టెన్షన్ పడకని రిషికి మహేంద్ర చెప్తాడు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని రిషి అడగగానే.. మీ విశ్వనాథ్ సార్ ఫోన్ చేసి, నీకు ఏంజిల్ కి పెళ్లి అని చెప్పి రమ్మని చెప్పారు. అసలు ఏం జరుగుతుంది రిషి అని మహేంద్ర అడుగుతాడు. దానికి రిషి సమాధానం చెప్పకుండా.. మీరు అవన్నీ ఇప్పుడు ఆలోచించకండని చెప్తాడు. వసుధార కాఫీ తెస్తానంటూ వెళ్తుంది. ఆ తర్వాత రిషి వచ్చి హాల్లో కూర్చొని ఉంటాడు. వసుధార కాఫీ తీసుకొని వస్తుంది. అసలు జీవితమేంటి ఇలా అవుతుందని రిషి బాధగా మాట్లాడతాడు. ఇవన్నీ కష్టాలు తొలగిపోవాలంటే మీరు ఇలా జరగడానికి గల కారణం తెలుసుకోవాలి? ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎవరు చేయిస్తున్నారు? మనవాళ్ళ వల్ల జరుగుతుందా అని తెలుసుకోవాలని వసుధార అనగానే రిషి కోపంగా వసుధార పైకి చెయ్యి ఎత్తుతాడు. మా వాళ్ళు ఎప్పుడు నా మంచి కోరుకునే వారే అంటూ వాళ్ళ వాళ్ళ వైపు సపోర్ట్ చేస్తాడు రిషి. ఆ తర్వాత వసుధార వాళ్ళ ఇంటి నుండి రిషి బయలుదేరి వెళ్లబోతుంటే వసుధార ఆపుతుంది. అయిన రిషి బలవంతంగా వెళ్లబోతుంటే రిషికి డోర్ మేకు గుచ్చకుంటుంది. అది చూసిన వసుధార వెంటనే రిషి చేతికీ కట్టు కడుతుంది. రిషి ఆ రోజు రాత్రి అక్కడే మహేంద్ర దగ్గర ఉంటాడు.

మరుసటి రోజు ఉదయం మహేంద్రకి ఫోన్ వస్తే లిఫ్ట్ చేయబోయి మహేంద్ర పడిపోతుంటే రిషి వచ్చి పట్టుకుంటాడు. ఆ తర్వాత జగతి వచ్చి మేం చేసినవన్ని తప్పులే అని ఒప్పుకుంటున్నాం మమ్మల్ని క్షమించు అని రిషిని జగతి రిక్వెస్ట్ చేస్తుంది కానీ రిషి జగతి మాటలు పట్టించుకోడు. ఆ తర్వాత విశ్వనాథ్ మహేంద్రకి ఫోన్ చేస్తే ఆ ఫోన్ రిషి లిఫ్ట్ చేసి మహేంద్ర వాళ్ళు వచ్చారు. నేను వాళ్ళ దగ్గర ఉన్నానని చెప్తాడు. వాళ్ళని తీసుకొని రమ్మని విశ్వనాథ్ చెప్తాడు. ఆ తర్వాత విశ్వనాథ్ కి నిజం చెప్పమని జగతి అంటుంది. ఏమని చెప్తారని రిషి అంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.