English | Telugu

ఎవడ్రా నువ్వు.. డర్టీ ఫెలో.. ఆదిని తన బాయ్ ఫ్రెండ్ తో తిట్టించిన రష్మీ

2023 ఇయర్ ఎండింగ్ సెలెబ్రేషన్స్ బుల్లితెర మీద మొదలైపోయాయి. మరి పుష్ప 2 కంటే కూడా రష్మీ పెళ్లి ఎప్పుడు అనే టాపిక్ జనాల్లో ఎక్కువగా ఉందంటూ రష్మీ తాను చేసుకోబోయే అబ్బాయిని ఇయర్ ఎండింగ్ రోజున చూపించేసింది. ఇక పెళ్లి పెద్దలుగా ఆది, రాంప్రసాద్ కలిసి ఆయన్ని ఫుల్ ఆడేసుకున్నారు.

"రష్మీ పెళ్లి పార్టీ" పోటీ పేరుతో మల్లెమాల వాళ్ళు దాదాపు రెండు గంటల వ్యవధి ఉన్న ఒక ఈవెంట్ ని ప్రసారం చేశారు. అందులో రష్మీ పెళ్లి ఎప్పుడు అంటూ ఆది అడిగేసరికి ఆమె సిగ్గుపడుతూ ఒక ఆరడుగుల అందగాడిని స్టేజి మీదకు తీసుకొచ్చింది. చమ్మక్ చంద్ర అతన్ని చూసి సర్ తెలుగునా, తమిళమా, కన్నడనా అని అడిగేసరికి అరె రండి మన రష్మీని అంత ఈజీగా చేసుకుంటాడా..రండి టెస్ట్ చేద్దాం అంటూ ఆది, రాంప్రసాద్ ఇద్దరూ బాగా ఆడుకున్నారు.."ఇంతకు నీ పేరేమిటి" అనేసరికి "సాకుల్ శర్మ నా పేరు నాకు రోహిత్ శర్మ కూడా తెలుసు..ఎవుడ్రా నువ్వు" అని ఆదిని గట్టిగానే అడిగాడు. "నేను ఆల్రెడీ చూసాను..మీరు రష్మీని చాల ఫ్లర్ట్ చేస్తున్నారా " అని అడిగేసరికి "నీకంటే నాది రెండు ఎకరా ఎక్కువా..హైట్ లో ..డర్టీ మైండ్ ఫెల్లో " అని మళ్ళీ పంచ్ వేసాడు. "ఈ జుట్టు ఒరిజినలా ప్లాంటేషన్ ఆ" అని రాంప్రసాద్ అడిగేసరికి "ప్లాంటేషన్ లేదు జెనెటికల్ ఉంది" అని కౌంటర్ ఇచ్చాడు. "రష్మిని ముద్దుగా ఏమని పిలుస్తావ్" అని ఆది అడిగేసరికి "నా హనీ" అని చెప్పాడు. బాబు ఫ్లోలో అన్నీ చెప్పేస్తున్నావా పక్కన నిలబడు అని రష్మీ అసలు సీక్రెట్ ని రివీల్ చేసింది..."సాకుల్ శర్మ నా కాలేజీ మేట్.. కాలేజీలో నన్ను బాగా ఫ్లర్ట్ చేసేవాడు. సరే ఇక్కడ నా పెళ్లి పార్టీ కాబట్టి పిలిచాను అంతే" అని రష్మీ ప్రాంక్ చేసేసరికి "ఐతే పెళ్ళికొడుకు ఇతను కాదా" అని అడిగాడు ఆది "కాదు" అని చెప్పింది రష్మీ.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.