English | Telugu
ఆర్పీ చెప్పినవన్నీ నిజాలే.. అబద్ధాలు కావు!
Updated : Jul 16, 2022
జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయ్యి ఇప్పుడు ఆ షో గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ వార్తల్లో నిలిచాడు కిర్రాక్ ఆర్పీ. మల్లెమాల ఎవరికీ సహాయం చేయదు అని అక్కడ ఫుడ్ సరిగా పెట్టరు అని, పేమెంట్ రెగ్యులర్గా ఇవ్వరని.. ఇలా ఎన్నో కామెంట్స్ వింటూనే ఉన్నాం. ఐతే ఇప్పుడు ఆర్పీ చేసిన కామెంట్స్ కి మద్దతు ఇస్తున్నారు రాకేష్ మాస్టర్. మల్లెమాలలో తన అనుభవాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బులెట్ భాస్కర్ కోరిక మేరకు పిలిస్తే అతని టీమ్ లో చేశానని చెప్పారు. ఆయన టీం మెంబెర్స్ ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవారని, భోజనాన్ని స్వయంగా ఆయనే తీసుకొచ్చేవారని కూడా తెలిపారు.
కానీ ఒక సందర్భంలో భాస్కర్ లేకపోయేసరికి తాను కూడా అందరి లాగే భోజనం కోసం క్యూలో నిలబడాల్సి వచ్చిందన్నారు. అక్కడ భోజనం అస్సలు బాగోదంటూ ఆరోపించిన ఆర్పీ మాటలు నిజమే అన్నారు రాకేష్ మాస్టర్. భాస్కర్ అక్కడి భోజనం బాగోకపోవడం వల్లనే బయటి నుంచి తనకు, తన టీమ్ మెంబర్స్కు తెప్పించేవాడని చెప్పారు. "మల్లెమాలలో భోజనాలు బాగుంటే బయటినుంచి తెప్పించుకోరు కదా" అన్నారు.
ఇదే కాకుండా ఇంకొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు రాకేశ్ మాస్టర్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్లకు అమ్మాయిల పిచ్చి ఎక్కువని, ఎప్పుడూ ఒకరో ఒక అమ్మాయితో ఎకసెక్కాలు చేస్తూనే ఉంటారని కూడా కామెంట్ చేశారు. జబర్దస్త్ డైరెక్టర్ వస్తే అందరూ లేచి నిలబడాలి అన్నారు మాస్టర్. ఇకపోతే "ఆర్పీ చెప్పినవన్నీ నిజాలే, అబద్ధాలు ఎంత మాత్రం కావు" అంటూ సపోర్ట్ చేశారు.