English | Telugu

రోజమ్మ మా అమ్మ కంటే ఎక్కువ...నా ప్రాణం నిలిపారు

సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ షో ఫైనల్స్ కి వచ్చేసింది. ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. ఈ షోకి మంచు లక్ష్మి, నటి రోజా వచ్చారు. ఈ షోకి డిటెక్టీవ్ గెటప్ లో పంచ్ ప్రసాద్ వచ్చాడు. రవి అతన్ని చూసి "అసలు నువ్వొచ్చిన పనేంటి" అని అడిగాడు. "నేను డిటెక్టీవ్ ని" అన్నాడు. "ఐతే ఆమె షూస్ , అతని సాక్స్ పోయాయట..అవి కనుక్కో ఫస్ట్" అన్నాడు ప్రసాద్.."సరే ఏదో ఒకటి చెయ్యి ఫస్ట్" అన్నాడు రవి.. "కుడి చెయ్యా ఎడమ చెయ్యా" అని ప్రసాద్ అనేసరికి "ఛి నేనెళ్ళి కూర్చుంటా" అని అష్షు వెళ్ళిపోయింది. ప్రసాద్ తన భార్య ఫోటో చూపించేసరికి రోజా " ఫస్టా, సెకండా, థర్డ్ ఆ" అని అడిగింది. తర్వాత రవి "ఇంతకు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎవరితో మాట్లాడ్డానికి" అని అడిగాడు.

వెంటనే ప్రసాద్ ఒక రోజా పిక్చర్ తీసి చూపించేసరికి రోజా నవ్వేసింది. "ఈరోజు ఇంత హ్యాపీ లైఫ్ ని భార్యా పిల్లలతో లీడ్ చేస్తున్నాను అంటే మేడం మీరు పెట్టిన బిక్షే మేడం. నిజం చెప్తున్నా మేడం నాకు మా అమ్మ ప్రాణం పోస్తే నా భార్య పునర్జన్మ ఇస్తే రోజమ్మ మా అమ్మ కంటే ఎక్కువ" అంటూ కాళ్ళ మీద పడ్డాడు ప్రసాద్. ఇక ఈ గ్రాండ్ ఫినాలేలో అమ్మాయిగారు - పడమటి సంధ్యారాగం వెర్సెస్ చామంతి- జానకి రామయ్య గారి మనవరాలు సీరియల్ టీమ్స్ మధ్యన ఈ పోటీ జరిగింది. ఇక రోజా ఫస్ట్ ఎపిసోడ్ లో చేసిన ఉప్మా ఛాలెంజ్ లో ఉప్మాన్ని అస్సలు మర్చిపోలేదంటూ చెప్పాడు రవి. "నేను చేసిన ఉప్మా తిన్న వాళ్ళు గెలిచారు చూసారుగా" అంది రోజా. దానికి ప్రభాకర్ కౌంటర్ వేసాడు. "అది ఉప్మా కాదురా...అది బోండాలా ఉన్న ఉప్మా" అన్నాడు. ఇక మంచు లక్ష్మి అమ్మాయిగారు - పడమటి సంధ్య రాగం టీమ్స్ ని లీడ్ చేసింది. రోజా చామంతి- జానకి రామయ్య గారి మనవరాలు టీమ్స్ ని లేదా చేశారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.