English | Telugu

మొక్కు తీర్చుకుని అన్నదానం చేసిన ఫ్యామిలీ...


ప్రియాంక జైన్ - శివ్ కుమార్ ఇద్దరూ బుల్లితెర మీద మంచి జోడి అని అందరికీ తెలుసు. ఆడియన్స్ కి కూడా వీళ్లంటే చాలా ఇష్టం కూడా. బిగ్ బాస్ సీజన్ 7 లో ప్రియాంక గేమ్ తో ఎంతోమంది ఫాన్స్ ని కూడా సంపాదించుకుంది. అలాంటి ప్రియాంక వాళ్ళ అమ్మకు సర్వైకల్ కాన్సర్ ఫస్ట్ స్టేజి అని తెలిసేసరికి ఇద్దరూ నీరుగారిపోయారు. ఇక ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు టెస్టులన్నీ చేసాక ఆమెకు లాప్రోస్కోపీ సర్జరీ చేసి గర్భాశయాన్ని తొలగించారు. ఇలా సర్జరీ మొత్తం పూర్తై ప్రస్తుతానికి అన్ని రకాల పరీక్షల్లో కూడా ఆమె సేఫ్ అని తెలుసుకున్నాక ప్రియాంక- శివ్ ఇద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆమె కోలుకుని తిరిగి వాళ్ళ ఇంటికి రావడంతో ఆ హ్యాపీనెస్ వీడియోని యూట్యూబ్ లో పోస్ట్ చేసింది ప్రియాంక . అలాగే రాముల వారి గుడికి వెళ్లి అక్కడ మొక్కు కూడా తీర్చుకుంది ప్రియాంక. కాన్సర్ నయం చేసుకుని తిరిగి వచ్చిన వాళ్ళ అమ్మను చూసి ఇదంతా ఆడియన్స్ ప్రేమ, అభిమానం, బ్లెస్సింగ్స్ వల్లనే జరిగాయని చెప్పింది.

ఇక ఈ రాముల వారి ఆలయంలో 400 ల ఏళ్ళ క్రితం నాడు ఉద్భవించిన హనుమంతుడి ఒరిజినల్ విగ్రహాన్ని శివ్ చూపించాడు. అలాగే ఆలయంలో పూజలన్ని పూర్తి చేసుకున్నాక అన్నదానం నిర్వహించారు. ఇక ఫైనల్ గా ప్రియాంక జైన్, శివ్ కుమార్ కలిసి చాలా హ్యాపీగా మాట్లాడుకున్నారు. ఐతే హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ముగ్గురినీ చూసి ఇందులో పేషెంట్ ఎవరూ అని అడిగారట డాక్టర్..అదే ట్విస్ట్.. అంటే ఆమె పేషెంట్ లా కనిపించరు ఆమె చాలా స్ట్రాంగ్ అని చెప్పాడు శివ్. ఎందుకంటే ప్రియాంక వాళ్ళ అమ్మ చూడడానికి తల్లీకూతుళ్లలా కాకుండా అక్క చెల్లెళ్ళలా కనిపిస్తారు. ప్రియాంక బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ఆమెను చూడడానికి నటి ప్రగతితో కలిసి బిగ్ బాస్ స్టేజ్‌ మీదకు వచ్చింది ప్రియాంక జైన్ తల్లి. ఆమెను చూసి నాగార్జున కూడా ఫిదా ఇపోయారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.