English | Telugu

శివ్ ది జిమ్ బాడీ..అందుకే డాన్స్ చేయను అని చెప్పా

"నీతోనే డాన్స్" ఆదివారం ఎపిసోడ్ లో మరో నాలుగు జంటల మధ్య పోటీ మంచి రసవత్తరంగా సాగింది. ఇందులో ప్రియాంక జైన్- శివ్ ఇద్దరూ కలిసి పంజాబీ స్టయిల్లో డాన్స్ చేశారు. వీళ్ళ డాన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. ప్రియాంక ఫుల్ ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేసింది అని తేజస్విని మార్క్స్ ఇస్తూ మరీ చెప్పింది. అప్పుడు ప్రియాంక ఒక విషయాన్ని ఈ స్టేజి మీద షేర్ చేసుకుంది. "ఐదేళ్ల క్రితం నేను స్టార్ మాలోకి వచ్చాను. స్టార్ మా నన్ను ఇంట్రడ్యూస్ చేసింది. నాకు అమ్ములు, జానకి అనే క్యారెక్టర్లు ఉన్నాయి అంటే అది ఈ స్టేజి వల్లనే. అప్పట్లో ఒక షో వచ్చేది..సీరియల్ సీరియల్ కి మధ్య స్టార్ మా పరివార్ లీగ్ అనే పోటీ ఉండేది.

అలా ఫస్ట్ టైం నేను శివ్ తో కలిసి డాన్స్ పెర్ఫార్మ్ చేసాను. ఆ తర్వాత నేను డైరెక్ట్ గా పిఆర్ దగ్గరకు వెళ్లి శివ్ తో డాన్స్ చేయను, లైఫ్ లో ఎప్పుడూ చేయను అని చెప్పేసాను. ఎందుకంటే అప్పట్లో శివ్ కి జిమ్ బాడీ ఉండేది. బైసెప్స్ ఉండేవి. దాంతో డాన్స్ అసలు చేయలేకపోయేవాడు. ఇప్పుడు జిమ్నాస్టిక్స్ చేసి బాడీని ఫ్లెక్సిబుల్ చేసుకున్నాడు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా గర్వంగా ఉంది శివ్ తో డాన్స్ చేయడం" అని చెప్పింది ప్రియాంక. ఇలా ఈ సండే ఎపిసోడ్ మంచి హుషారుగా సాగింది. మార్క్స్ విషయంలో సాగర్-దీప, ఆట సందీప్-జ్యోతి, ప్రియాంక- శివ్ మధ్య గొడవ జరిగింది కానీ రాధా సర్దిచెప్పారు. ఇక హయ్యెస్ట్ మార్క్స్ తో సందీప్- జ్యోతి జోడి గోల్డెన్ సీట్ లో కూర్చునే ఛాన్స్ కొట్టేశారు. ఈ వారం ఎలిమినేషన్ లేదు కానీ నెక్స్ట్ వీక్ ఉంటుంది అని చెప్పింది శ్రీముఖి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.