English | Telugu

నా కూతురిని చాలా మిస్ అవుతూ ఉంటా..

ఢీ సెలబ్రిటీ షో ప్రతీ వారం డాన్స్ తో పాటు స్కిట్స్ కూడా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. ఇక ఈ షోకి జడ్జెస్ గా ప్రణీత, శేఖర్ మాష్టర్ వచ్చి తమ జడ్జిమెంట్ తో అప్పుడప్పుడు డాన్స్ తో ఆడియన్స్ ని అలరిస్తూ ఉంటారు. అలాంటి జడ్జి ప్రణీత తన ఇన్స్టాగ్రామ్ పేజీలో "వాట్సప్" అని ఫాన్స్ ని అడిగేసరికి నెటిజన్స్ వాళ్ళ వాళ్ళ ప్రశ్నలను అడగడం స్టార్ట్ చేశారు "ఢీ ఫామిలీలో ఒక భాగమైనందుకు ఎలా ఫీలవుతున్నారు" " చాలా బాగుంది. ఇక ఫోటో మా హజ్బెండ్ ది, నందు, కెమెరా టీమ్ వాళ్ళు బ్రేక్ టైములో సరదాగా ఇలా నన్ను ఆటపట్టిస్తూ ఉంటారు" అని చెప్పింది. "మీ కూతురిని మిస్ అవుతున్నారా" " ఎస్.. ఎప్పుడు జర్నీ చేసినా పాప గుర్తొస్తుంది..అందుకే ఉదయం వెళ్ళిపోయి మళ్ళీ రాత్రికి తిరిగి రిటర్న్ వచ్చేసి పాపతో టైం స్పెండ్ చేస్తాను" అని చెప్పింది.

"ఇస్తాంబుల్ ట్రాఫిక్ గురించి మీ అభిప్రాయం" " పర్లేదు" "బ్యాంకాక్ లో ట్రాఫిక్ చాలా హెవీగా ఉంటుంది. అందుకే నేను టైం సేవ్ చేసుకోవడం కోసం చిన్న చిన్న ఆటోల్లో వెళ్తుంటాను" అని చెప్పింది. "మీరు ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరు " "మా నాన్న మా హాస్పిటల్లో పాతికేళ్లుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిరవిస్తూ 140 సార్లుకు పైగా ఆయన కూడా బ్లడ్ డొనేట్ చేశారు" అని చెప్పింది. "మీరు మా బాస్ దర్శన్ కాంబినేషన్ సూపర్" "ఆల్వేస్ ది బెస్ట్" అంది. "కన్నడలో మరిన్ని సినిమాలు చేయండి" "ఎస్ ..రమణ అవతారతో త్వరలో" అంది. ఐతే రీసెంట్ గా ఒక ట్రాన్స్పరెంట్ శారీలో కనిపించింది ప్రణీత. ఆ శారీ లుక్ లో ప్రణీత్ రాణిలా ఉందని కామెంట్స్ చేశారు. ఈ శారీలో రీల్స్ చేశారా అని అడిగేసరికి ఎలాంటి రీల్స్ చేయలేదు అని చెప్పింది. ఇక చెప్పాలంటే ప్రణీత సుభాష్ కెరీర్ కి కొంత బ్రేక్ వచ్చింది. ఐతే ఇప్పుడు ఆమె మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ప్రస్తుతం ఆమె "రామన అవతార" అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే మలయాళ నటుడు దిలీప్ కుమార్ కి జంటగా ఒక మూవీలో కనిపించబోతున్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.