English | Telugu

పెళ్లి చేసుకుంటే ఫీలింగ్స్ చచ్చిపోతాయన్నారు అందుకే చేసుకోవట్లేదు....


హీరో నవదీప్ టాలీవుడ్ లో మంచి క్రేజీ ఫాలోయింగ్ ఉన్న హీరో. ఓటిటి మీద రీసెంట్ న్యూసెన్స్ అనే మూవీతో హిట్ కొట్టిన నవదీప్ తర్వాత "డగ్ అవుట్" అనే షోతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. ఐతే నవదీప్ రీసెంట్ గా ఒక షోలో తన పెళ్ళికి సంబందించిన కొన్ని విషయాలు చెప్పాడు. "మీరు వెళ్లేందుకు చేసుకోవట్లేదు" అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు " పెళ్లి చేసుకోమని నన్ను నువ్వు ఎందుకు అడగడం లేదు...నా గురించి తెలుసుకుని ఎక్కువమంది వస్తున్నారు కానీ నా గురించి నేను చాలా తక్కువగా చెప్పుకుంటున్నాను.

నాలో ఎన్ని ఫీలింగ్స్ ఉంటాయో మీకెవ్వరికీ తెలీదు. ఫీలింగ్స్ ఎక్కువైపోయి పెళ్లి చేసుకోలేకపోతున్నాను. ఒక్కసారి పెళ్లి చేసుకుంటే ఫీలింగ్స్ చచ్చిపోతాయని చెప్పారు ఎవరో అందుకే పెళ్లి చేసుకోవడం లేదు..పెళ్లి ఎందుకు చేసుకుంటున్నామో కరెక్ట్ రీజన్ తెలిసి ఆ టైం కరెక్ట్ అని ఆ మనిషి కరెక్ట్ అని అనిపించినప్పుడే పెళ్లి చేసుకోవాలి. కొంతమంది లైఫ్ స్టైల్ కి పెళ్లి ముందుగా జరుగుతుంది... కొంతమంది లైఫ్ స్టైల్ కి తర్వాత జరుగుతుంది..ఉదాహరణకు సల్మాన్ ఖాన్, ప్రభాస్.. నా మీద ఎన్ని కాంట్రోవర్సీలు వచ్చినా, ఎన్ని కేసులు వచ్చినా ఇలా బయటకు వచ్చేస్తాను అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నామీద కేసులు కాదు న్యూసులు ఎక్కువ హడావిడి ఎక్కువ..నా వయసు 38 ...ఇండస్ట్రీలో ఆటగాడే అని మా రానా బాబుని చూసినప్పుడు అనిపిస్తుంది అది కూడా పెళ్ళికి ముందు. రీసెంట్ గా ఒక అమ్మాయి నుంచి నాకు బంపర్ ఆఫర్ వచ్చింది. తనను పెళ్లి చేసుకుంటే ఇంత కట్నం గ్యారెంటీ అని ఆఫర్ ఇచ్చింది. ఆ అమ్మాయి కూడా తెలిసిన అమ్మాయే ఒక పార్టీలో ఈ ఆఫర్ ఇచ్చింది. సెలబ్రిటీ స్టేటస్ అంతా బయట. ఇంట్లోకి వెళ్తే చాలు నన్ను తిట్టడం కోసమే మా అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది." అని చెప్పాడు. నవదీప్ తెలుగులో చందమామ, గౌతమ్ ఎస్ఎస్ సి లాంటి మూవీస్ లో నటించాడు. ఆ తర్వాత హీరోగా సరైన అవకాశాలు లేక ఆర్య, అలవైకుంఠపురంలో మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలక పాత్రల్లో నటించి అలరించాడు. ఐతే త్వరలో లవ్ మౌళి మూవీతో ఆడియన్స్ ముందు రాబోతున్నట్లు చెప్పాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.