English | Telugu

వంటలక్క కాదు ఫొటోల‌క్క‌.. నిరుపమ్ సెటైర్లు!

బుల్లితెరపై 'కార్తీకదీపం' సీరియల్ జనాలను ఎంతగా ఆకట్టుకుంటుందో తెలిసిందే. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సీరియల్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సీరియల్‌లో నటించే తారలంతా ప్రేక్షకులు దగ్గరయ్యారు. సోష‌ల్ మీడియాలో 'కార్తీకదీపం' సీరియల్ హల్చల్ చేస్తుంటుంది. డాక్టర్ బాబు పాత్రలో నిరుపమ్ తన నటనతో మెప్పిస్తుంటే.. వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్ ఓ రేంజ్‌లో పెర్ఫార్మ్ చేస్తోంది.

ఈ జంట ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా నిరుపమ్ ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ అభిమానులకు టచ్‌లో ఉంటారు. తనదైన స్టైల్‌లో సెటైర్లు, పంచ్‌లు వేస్తూ అలరిస్తుంటారు. తన మీద, 'కార్తీకదీపం' సీరియల్ మీద వచ్చే మీమ్స్‌ను బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇదిలా ఉండగా తాజాగా నిరుపమ్ తన ఇన్స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు.

ఆదివారం అయితే మాములుగా అందరూ ఇంటిపట్టునే ఉంటారు. షూటింగ్‌లు ఏవీ పెద్దగా ఉండవు. కానీ 'కార్తీకదీపం' యూనిట్ మాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తుందట. ఆదివారం కూడా షూటింగ్ పెట్టడంతో కోపంగా ఉన్నానని చెప్పిన నిరుపమ్.. వంటలక్క మాత్రం ఫోటోలు తీస్తూ.. ఫొటోలక్కగా మారుతుందేమో అని కౌంటర్ వేశారు. వంటలక్క తీసిన ఫోటోలో నిరుపమ్ బుంగమూతి పెట్టుకొని కనిపించారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.