English | Telugu

అతను బొమ్మలేస్తే.. ఈమె డాల్గోన కాఫీ చేస్తుంది

నిహారిక .. మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా ఆడియన్స్ కి చిరపరిచితమే. బుల్లితెర మీద నటిగా, హోస్ట్ గా కెరీర్ ని స్టార్ట్ చేసింది. అలాగే నిర్మాతగా కొన్ని వెబ్ సిరీస్ ని కూడా నిర్మించింది. ఒక చిన్న ఫామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ నిర్మించి మంచి మార్క్స్ కొట్టేసింది. కొన్ని మూవీస్ లో కూడా నటించింది. కానీ అనుకున్నంత స్థాయిలో పేరు రాకపోయేసరికి సోషల్ మీడియాలో డిఫరెంట్ షోస్ చేస్తూ దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు కొణిదెల నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డతో కలిసి నిఖిల్ తో నాటకాలు షోకి వచ్చేసింది. ఇక ఈ షోలో నిహారిక తన భర్త గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పింది. మీ ఆయనలో నువ్ గమనించిన విషయాలు ఏమిటి అని నిఖిల్ అడిగేసరికి తానొక మంచి ఆర్టిస్ట్ అనే విషయం తెలిసిందని చెప్పింది. నిహారికకు స్టేషనరీ షాప్స్ కి వెళ్లి కాసేపు ఎంజాయ్ చేయడం ఇష్టం.

అదే టైంలో ఒకసారి చైతన్య హెచ్ బి పెన్సిల్స్ ని, స్కెచ్ బుక్స్ ని కొంటూ ఉండడం గమనించాను. హాబీ ఏమన్నా స్టార్ట్ చేస్తున్నాడేమో పోన్లే అని అనుకున్నా.. కానీ తర్వాత మా ఇంట్లో పెంచుకునే కుక్క బొమ్మ గీసి చూపించేసరికి చాలా షాక్ అయ్యాను. పెళ్లి చూపులప్పుడు నీ గురించి చెప్పు అని ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు. కానీ నేను తర్వాత గుడ్ ఆర్టిస్ట్ అనే విషయాన్ని మాత్రం కనిపెట్టాను. తన హస్బెండ్ లో ఇలాంటి క్వాలిటీ ఉందని చాలా రోజులు తెలుసుకోలేకపోవడం నిజంగా కొంచెం బాదే అని చెప్పింది. తర్వాత చైతన్య వంతు వచ్చేసింది. నిహారికలో మీరు కనిపెట్టిన, ఇష్టమైన అంశాలేమిటి అని నిఖిల్ అడిగేసరికి. నిహారిక డాల్గోన కాఫీ చాలా అద్భుతంగా చేస్తుంది. తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి ఈమధ్యనే మేమంతా వెళ్ళాం. ఐతే ఒకరోజు మార్నింగ్ నీకు డాల్గోన కాఫీ కావాలా అని నన్ను అడిగింది. ఐతే అది ఎప్పుడు నేను తాగలేదు నాకు అసలు తెలీదు కూడా. కానీ ఆ కాఫీ తాగాక అమేజింగ్ అనిపించింది అంటూ నిహారిక చేసిన కాఫీ గురించి చెప్పేసాడు. ఇక మీ ఇద్దరిదీ ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చిన వివాహమా అని అడిగేసరికి అరేంజ్డ్ మ్యారేజ్ అంటూ చెప్పారిద్దరూ.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.