English | Telugu

వేటూరి గారిది స‌మ్మోహ‌న‌త్వం.. ఆ త‌ర్వాత వాళ్ల‌ది ఉత్త క‌విత్వం!

జొన్నవిత్తుల రామలింగేశ్వరావు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గేయ ర‌చ‌యిత‌గా మూవీస్ లో ఎన్నో హిట్ సాంగ్స్ రాసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నారు. "అవార్డులు ఏవీ రాకపోయినా ఎక్కడైనా నా పాటలే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.. అంతకన్నా నాకు అవార్డులు ఏం కావాలి" అని అంటారు జొన్నవిత్తుల. తన లైఫ్ లో వాళ్ళ నాన్న గారు అడిగిన కొన్ని విషయాలను అలీతో సరదాగా షోలో చెప్పుకొచ్చా జొన్నవిత్తుల.

"ఏరా జీవితంలో నేనేమన్నా నీకు ఇచ్చానా?" అని 90 ఏళ్ల వయసులో తనని అడిగారట. "ఏతండ్రి ఇవ్వనంత సంపద నాకు ఇచ్చావ్.. అంతకన్నా నాకు ఏం కావాలి నాన్నా" అన్నారట జొన్నవిత్తుల. తాను రాసే పాటలే కాదు, తన కంఠస్వరం కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చాలా మంది అనేవారట. ఐతే వాళ్ళ నాన్నగారి వాయిస్ లో పది శాతం త‌న‌కు అలాంటి కంఠస్వరం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంటుంది అన్నారాయ‌న‌. ఇక తన బాబాయి జెవిఎస్ రావు. ఆయన హిందుస్తానీ సంగీతంలో మహా విద్వాంసులు. ఆయన విజయవాడ సంగీత కళాశాలలో హిందుస్తానీ సంగీతం లెక్చరర్ గా కూడా పని చేసారని జొన్న‌విత్తుల వెల్ల‌డించారు.

అలాగే చిన్న తాతయ్య ఆంధ్ర గంధర్వ జొన్నవిత్తుల శేషగిరిరావు గారి కంఠ స్వరం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని అన్నారు. "మా అమ్మకి అన్నయ్య ఐన దైతా గోపాలం గారు నాకు మావయ్య అవుతారు. ఆయన, మా చిన్న తాతయ్య కలిసి కొన్ని పౌరాణిక నాటకాలు వేశారు. అలా అమ్మ తరపు వైపు, నాన్న తరపు కూడా సంగీత నేపథ్యం ఉన్న కుటుంబాలు కావడంతో నాకు సంగీతం కాస్త అబ్బింది" అని చెప్పారు జొన్నవిత్తుల.

అలాగే తాను సరిగమపలతో రాసిన పాట విన్న ఆరుద్ర గారు తనని మెచ్చుకున్నారని చెప్పారు. పాటకు పరాకాష్ట వేటూరి గారు అంటే ఇష్టం అని చెప్పారు. "పాటకు సమ్మోహనత్వం సమకూర్చడం అనేది నారాయణరెడ్డి గారి తర్వాత వేటూరి గారికే అంతటి శక్తి ఉంది అని అనుకుంటాను. ఆ సమ్మోహనత్వం అంటే బెర్ముడా ట్రయాంగిల్ లాంటిది. మనసును పాట వైపు అలా లాగేస్తుంది. కావాల్సింది అదీ. మిగాతా వాళ్ళు రాసే పాటల్లో కవిత్వం మాత్రమే ఉంటుంది" అంటూ మనసులో మాట చెప్పారు జొన్నవిత్తుల.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.