Read more!

English | Telugu

ఆంటీ అనడం క్రైమ్ అంటున్న లాస్య ..జైల్లో పెట్టాలి అన్న నెటిజన్

"ఆంటీ" అనే పదం సోషల్ మీడియాలో నిన్న మొన్నటి వరకు ఫుల్ వైరల్ అయ్యింది. అనసూయను ఆంటీ అన్నందుకు నెటిజన్స్ కి ఆమెకు మధ్య జరిగినల్ ట్విట్టర్ వార్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఐతే ఈ ఆంటీ అనే పదం అప్పుడప్పుడు మిగతా షోస్ లో పొరపాటున అనడం నాలుక్కరుచుకోవడం చాలా మంది చేస్తూనే ఉన్నారు. ఐతే సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ చేసిన రీల్స్ మాత్రమే కాకుండా మిగతా సాధారణ ప్రజలు చేసే షార్ట్స్, రీల్స్ ని కూడా కొంత మంది సెలెబ్రిటీస్ చేస్తూ ఉంటారు. అలా సోషల్ మీడియాలో రీసెంట్ గా శ్రీదేవి అనే ఒక అమ్మాయి "ఆంటీ" అనే కాన్సెప్ట్ తో ఒక రీల్ చేసింది. ఆ రీల్ ఫుల్ వైరల్ అయ్యింది.

దాన్ని ఇప్పుడు లాస్య మంజునాథ్ కూడా చేశారు. "నన్ను ఒకళ్ళు మిస్ ఇండియాలా ఉన్నావు..బ్యూటిఫుల్ గర్ల్ అని పిలిచారు. చూసారా వినడానికి చెవులకు ఎంత బాగుందో..అలా పిలవచ్చు కదా అందరూని..అలా పిలవడం మానేసి ఆంటీ..ఆంటీ అని పిలుస్తారు" అని చేసింది. ఈ వీడియోని లాస్య కూడా చేసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. "ఆంటీ అనడం క్రైమ్ కదా..మీరేం అంటారు" అని ఒక టాగ్ లైన్ పెట్టింది. ఇక నెటిజన్స్ కూడా కామెంట్స్ పెట్టారు. "పెళ్ళైన వాళ్లు ఆంటీనే కదా అని అంటే ఆంటీ అన్నవాళ్లను జైల్లో పెట్టాలి" అని ఇంకొకరు కామెంట్స్ పెట్టారు.  బుల్లితెర మీద  అతి తక్కువ కాలంలోనే పేరు తెచ్చుకున్న యాంకర్స్ లో  లాస్య ఒకరు.  అమాయకత్వంతో,  చిలిపి అల్లరితో అందరి దృష్టిని ఆకర్షించింది.  చీమ, ఏనుగు జోకులతో ఫుల్ ఫేమస్ అయ్యింది. మంజునాథ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని  ఫ్యామిలీకే ఎక్కువ టైం కేటాయిస్తోంది. యూట్యూబులో లాస్య టాక్స్ పేరుతో ఇంటరెస్టింగ్  వీడియోలు షేర్ చేస్తూ ఫాన్స్ ని పలకరిస్తూ ఉంటుంది..