English | Telugu

అంబటి అర్జున్‌ ఫేక్‌ అని చెప్పిన నాగార్జున.. షాక్‌ లో కంటెస్టెంట్స్‌!

బిగ్‌ బాస్‌ సీజన్‌-7 ఇప్పటికే పది వారాలు పూర్తి చేసుకుంది. ఇక పదకొండవ వారం హౌస్‌ లో ఎవరు ఎలిమినేషన్‌ అవుతారనే క్యూరియాసిటి అందరిలో మొదలైంది. అయితే శనివారం నాటి ఎపిసోడ్‌ కోసం బిగ్‌ బాస్‌ అభిమానులు ఎంతగా ఎదురు చూస్తారో తెలిసిందే.

శనివారం నాటి ఎపిసోడ్‌లో నాగార్జున అదిరిపోయే డ్యాన్స్‌తో వచ్చాడు. నాగార్జున రావడం రావడమే ఫుల్‌ ఫైర్‌ మీద కన్పించాడు. షుగర్‌తో చేసిన బాటిల్స్‌ తీసుకొని వచ్చాడు. ఒక్కో కంటెస్టెంట్‌ తల మీద ఆ బాటిల్‌ పగులగొట్టి వార్నింగ్‌ ఇచ్చాడు నాగార్జున. మొదట కొత్త కెప్టెన్‌ ప్రియాంకని అభినందించాడు నాగార్జున. ఆ తర్వాత శివాజీని లేపి.. నాకు కొన్ని డౌట్స్‌ ఉన్నాయి? కొన్ని సమస్యలున్నాయని నాగార్జున అనగా.. అప్పుడప్పుడు వచ్చే బూతులే కదా సర్‌ అని శివాజీ అన్నాడు. ‘‘ఈ విషయంలో నీ సమర్థత ఏం అయింది. ఈ విషయంలో నీ సహనం ఏమైంది. పిచ్చి పోహా, ఎర్రి పోహా ఇవన్నీ హౌస్‌లో వాడే పదాలా శివాజీ’’ అని నాగార్జున అన్నాడు. ‘మాది పల్నాడు సర్‌.. ఇవన్నీ చాలా కామన్‌గా సరదాగా మాట్లాడుకుంటాం మేము. ఈ హౌస్‌లో ఇక ఇలాంటివి రాకుండా జాగ్రత్తగా ఉంటాను బాబు గారు’ అన్నాడు శివాజీ .

అంబటి అర్జున్‌ ఇన్ని రోజులు ఫేక్‌గా నటించావ్‌. ఫ్యామిలీ వీక్‌లో మీ భార్య సురేఖ వచ్చి నీలోని ఫైర్‌ బయటకు తీయమని చెప్పింది. అప్పటి నుండి నామినేషన్‌లో ప్రశాంత్‌ మీద ఫైర్‌ అయ్యావని నాగార్జున చెప్పి బాటిల్‌ పగులగొట్టాడు. ఆ తర్వాత రతిక ఫోటో మీద బాటిల్‌ పగులకొట్టి.... ఇకనుండి కొన్ని పదాలను బ్యాన్‌ చేస్తున్నాను. ‘‘వచ్చేవారం నుండి నేనేంటో చూపిస్తాను. నేను ఆడతాను. ఇలాంటి పదాలన్నీ బ్యాన్‌ చేస్తున్నాను’’ అని రతికతో అన్నాడు. అమర్‌.. నేను విన్నర్‌ అని అనుకోకపోతే ఎలా గెలుస్తావని అమర్‌దీప్‌తో నాగార్జున అన్నాడు. చెల్లెలిని గెలిపించడం తప్ప హౌస్‌లో నువ్వేమైనా చేశావా గౌతమ్‌ అని అన్నాడు. అసలు ఈ వారం ఏం అయినా ఆడావా ప్రశాంత్‌.. ఫ్యామిలీ వీక్‌లో వచ్చినవాళ్ళంతా టాప్‌-5లో నీ పేరు పెట్టారని, హమ్మయ్య ఇంకా నేను ప్రూవ్‌ అని అనుకున్నావా లేక ఇంకెవరికైనా అవకాశం ఇద్దామని అనుకున్నావా ప్రశాంత్‌ అని నాగార్జున అన్నాడు. ఇలా ఈ వారం కంటెస్టెంట్స్‌ ఆడిన ఆటతీరుని ప్రశ్నిస్తూ గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు. కాగా మరొక విషయం ఏమిటంటే.. ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్‌ వచ్చేవరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.