English | Telugu

వదిలేయ్ రా అన్న శివాజీ... నాగార్జున వార్నింగ్!

బిగ్ బాస్ సీజన్-7 శనివారం ప్రోమో కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. దానికి కారణం ఉంది. సీరియల్ బ్యాచ్ చేసే పాలిటిక్స్ అన్నీ నాగార్జున ప్రూఫ్ లతో సహా చూపించి వారికి బుద్దిచెప్తాడని అందరు అనుకుంటున్నారు. అదే జరిగింది. టాస్క్ లో ఎవరేం చేశారో చెప్తూ అడిగేశాడు నాగార్జున.

కెప్టెన్సీ టాస్క్ కోసం జరిగిన టాస్క్ లలో అమర్ దీప్ మాటలని పాయింట్ అవుట్ చేస్తూ.. ఆ బొక్కలో గేమ్ అని తిట్టావ్ అది కరెక్టేనా అని నాగార్జున అడుగగా.. సారీ సర్ అదేదో కామెడీగా అన్నానని అమర్ దీప్ అన్నాడు. ఇలా ఒక్కో కంటెస్టెంట్ వారు చేసే తప్పొప్పులని ఎత్తి చూపిస్తూ వారికి మాస్ వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున.

అసలు ప్రోమోలో ఏం ఉందంటే.. లాస్ట్ వీక్ మీకు జరిగినటువంటి అన్యాయాలు ఏమైనా ఉన్నాయా అని నాగార్జున అడిగాడు. నువ్వు స్టాండ్ తీసుకోకపోవడం మూలానా నీ బడ్డీ నష్టపోయిందని ప్రియాంక జైన్ గురించి శోభా శెట్టిని నాగార్జున అడిగాడు. తనేదో వివరిస్తుంటే.. ఫైనల్ రిజల్ట్ ఏంటని అడిగితే శోభా శెట్టి మొహం మాడ్చేసింది. ఆ తర్వాత శుభశ్రీ-గౌతమ్ ల బడ్డీ గురించి అడిగాడు నాగార్జున. నా సైడ్ నుండి నేనేమైనా చెప్తే తను యాక్సెప్ట్ చేయట్లేదని శుభశ్రీ అనగా.. గౌతమ్ పాపం తన ఫీలింగ్ కూడా రెస్పెక్ట్ చేయాలి కదా అని నాగార్జున అడిగాడు.

ఫ్రూట్ నింజా టాస్క్ లో ఆట సందీప్ తొక్కలు వేశాడని ప్రశాంత్ అంటుంటే.. వదిలేయ్ రా అని ఎలా అంటావని శివాజీనీ నాగార్జున అడిగాడు. అప్పుడు సంఛాలక్ అమర్ దీప్ కి చెప్పాలి కదా అని అనగా.. అసలు అమర్ దీప్ ఏం చెప్పిన వినడు సర్. వాడికొక నెగెటివ్ ఫీలింగ్. ప్రతీ దానికి గొడవలు పెట్టుకుంటే నాతోని కాదు సర్ అని శివాజీ అన్నాడు. తాజాగా విడుదలైన ఈ ప్రోమో ఇప్పుడు యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.