English | Telugu

వదిలేయ్ రా అన్న శివాజీ... నాగార్జున వార్నింగ్!

బిగ్ బాస్ సీజన్-7 శనివారం ప్రోమో కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. దానికి కారణం ఉంది. సీరియల్ బ్యాచ్ చేసే పాలిటిక్స్ అన్నీ నాగార్జున ప్రూఫ్ లతో సహా చూపించి వారికి బుద్దిచెప్తాడని అందరు అనుకుంటున్నారు. అదే జరిగింది. టాస్క్ లో ఎవరేం చేశారో చెప్తూ అడిగేశాడు నాగార్జున.

కెప్టెన్సీ టాస్క్ కోసం జరిగిన టాస్క్ లలో అమర్ దీప్ మాటలని పాయింట్ అవుట్ చేస్తూ.. ఆ బొక్కలో గేమ్ అని తిట్టావ్ అది కరెక్టేనా అని నాగార్జున అడుగగా.. సారీ సర్ అదేదో కామెడీగా అన్నానని అమర్ దీప్ అన్నాడు. ఇలా ఒక్కో కంటెస్టెంట్ వారు చేసే తప్పొప్పులని ఎత్తి చూపిస్తూ వారికి మాస్ వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున.

అసలు ప్రోమోలో ఏం ఉందంటే.. లాస్ట్ వీక్ మీకు జరిగినటువంటి అన్యాయాలు ఏమైనా ఉన్నాయా అని నాగార్జున అడిగాడు. నువ్వు స్టాండ్ తీసుకోకపోవడం మూలానా నీ బడ్డీ నష్టపోయిందని ప్రియాంక జైన్ గురించి శోభా శెట్టిని నాగార్జున అడిగాడు. తనేదో వివరిస్తుంటే.. ఫైనల్ రిజల్ట్ ఏంటని అడిగితే శోభా శెట్టి మొహం మాడ్చేసింది. ఆ తర్వాత శుభశ్రీ-గౌతమ్ ల బడ్డీ గురించి అడిగాడు నాగార్జున. నా సైడ్ నుండి నేనేమైనా చెప్తే తను యాక్సెప్ట్ చేయట్లేదని శుభశ్రీ అనగా.. గౌతమ్ పాపం తన ఫీలింగ్ కూడా రెస్పెక్ట్ చేయాలి కదా అని నాగార్జున అడిగాడు.

ఫ్రూట్ నింజా టాస్క్ లో ఆట సందీప్ తొక్కలు వేశాడని ప్రశాంత్ అంటుంటే.. వదిలేయ్ రా అని ఎలా అంటావని శివాజీనీ నాగార్జున అడిగాడు. అప్పుడు సంఛాలక్ అమర్ దీప్ కి చెప్పాలి కదా అని అనగా.. అసలు అమర్ దీప్ ఏం చెప్పిన వినడు సర్. వాడికొక నెగెటివ్ ఫీలింగ్. ప్రతీ దానికి గొడవలు పెట్టుకుంటే నాతోని కాదు సర్ అని శివాజీ అన్నాడు. తాజాగా విడుదలైన ఈ ప్రోమో ఇప్పుడు యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.