English | Telugu
అమ్మాయిలు ఏడ్చుకుంటు మెసెజ్ లు పెట్టేవాళ్ళు!
Updated : Aug 27, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు(Guppedantha Manasu). ఈ సీరియల్ లో రిషి, వసుధారల జోడీకి ఫ్యాన్ బేస్ గట్టిగా ఉంది. అదే విషయం చాలా సందర్భాలలో బహిర్గతమైంది.
మరికొన్ని రోజుల్లో ఈ సీరియల్ ముగుస్తుంది. రీసెంట్ గా దర్శకుడు కుమార్ పంతం 'క్లైమాక్స్ షూట్ డన్ ' అంటు కొన్ని ఫోటోలని కూడా షేర్ చేశాడు. అదే విషయాన్ని తెలియజేస్తూ ముఖేష్ గౌడ కొన్ని విషయాలని పంచుకున్నాడు. పెద్ద సక్సెస్ తర్వాత గుప్పెడంత మనసు సీరియల్ ముగింపుని కూడా సక్సెస్గానే చూస్తున్నా. సక్సెస్ అనేది ఒకసారి వస్తుంది.. ఆ తర్వాత పోతుందని అంటారు. కానీ గుప్పెడంత మనసు సీరియల్ అలా కాదు.. ఎలా సక్సెస్తో మొదలైందో.. అదే సక్సెస్తో ఎండ్ అవుతుంది. ఇది చాలా గొప్ప విషయం. నేను కొన్నాళ్ల పాటు సీరియల్లో కనిపించకపోయేసరికి నాకోసం ఎంతో ఎదురుచూశారు. ఇది వాళ్లు నాపై చూపించే ప్రేమ. వాళ్ల సపోర్ట్ వల్లే నేను తిరిగి వచ్చాను. నేను అనుకోకుండా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ల పిలుపు వినే నేను తిరిగి వచ్చాను. నేను వాళ్లని చాలా మిస్ అయ్యాను ఆ టైంలో. ప్రేమను పోగొట్టుకోవడం కాదు కాదు.. ఆ ప్రేమ డబుల్ అయ్యింది. నేను ఉన్నప్పుడు ఒక గ్రాఫ్లో ఉండేది.. నేను లేకపోయినప్పుడు మరో గ్రాఫ్కి వెళ్లింది. నేను లేనని చాలా ఫీల్ అయ్యారు. ఏడ్చారు.. వాయిస్ మెసేజ్లు పెట్టారు. కొంతమంది అమ్మాయిలు అయితే ఏడ్చుకుంటూ వాయిస్ మెసేజ్లు పెట్టేవారు. వాళ్లని చూస్తుంటే బాధేసింది. వాళ్లే నా బలం.
తెలుగు ఆడియన్స్ ఒకసారి ఇష్టపడితే.. వాళ్లింటి బిడ్డలా చూసుకుంటారని అనడానికి నేనే సాక్ష్యం. నా ఇంట్లో కూడా నాకు ఇంత ప్రేమ దొకరలేదు. కానీ తెలుగు ఆడియన్స్ మాత్రం నన్ను ఎంతో ప్రేమించారు. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడ్ని. ఇంత ప్రేమ, ఇంత ఆదరణ నేను ఊహించలేదు. నేను మళ్లీ సీరియల్లోకి తిరిగి వచ్చానంటే వాళ్లు నాపై చూపించిన ప్రేమే కారణం. రిషిధార బంధానికి విడుదల అనేది ఉండదు..రిషిధార.. పేరుకి తగ్గట్టే ఎప్పటికీ ఆ బంధం ఉంటుంది.. వాళ్ల మధ్య గ్యాప్ ఉండదు.. హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. రిషిధారల మధ్య బాండింగ్ ఎప్పటికీ ఉంటుందనే మెసేజ్తో గుప్పెడంత మనసు సీరియల్ ఎండ్ అవుతుందంటు ముఖేష్ గౌడ చెప్పుకొచ్చాడు.