Read more!

English | Telugu

ఆరొందల ఎపిసోడ్ లు పూర్తిచేసుకున్న మల్లి.. సంబరాల్లో సీరియల్ యూనిట్ !

 

స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్  'మల్లి'. ఈ సీరియల్ లో అరవింద్ , మల్లిల ప్రేమని చూసి వీరికి ఫ్యాన్ బేస్ ఏర్పడింది‌. ఇక మల్లి అలియాస్ భావన లాస్య రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ లు రీల్స్ చేస్తూ కుర్రకారుని ఆకర్షిస్తుంది. అయితే తాజాగా మల్లి సీరియల్ ఆరొందల(600) ఎపిసోడ్ లు పూర్తిచేసుకుంది. దాంతో సీరియల్ యూనిట్ సంబరాలలో మునిగి తేలారు. కాగా ఈ సీరియల్ ని అభిమానించే వారికి  ఇది ఒక మైలురాయిగా నిలిచింది‌.

మల్లి సీరియల్ తాజా ఎపిసోడ్ లలో.. మల్లి తన అత్తమ్మ కౌసల్యతో మాట్లాడుతుంది. చూడు మీరా నేను మాలినీ పెళ్లి సంబంధాలు చూస్తున్నానని నువ్వు వెళ్లి మల్లికి చెప్పావే అనుకో ఆ మల్లి వచ్చి పెళ్లి సంబంధాలు ఆపింది అనుకో తల్లి కూతుర్లు నా చేతిలో చేస్తారు అంటూ కోపంగా వెళ్ళిపోతుంది వసుంధర. కట్ చేస్తే, ఈమధ్య పుస్తకాల కంటే ఫోన్లో ఎక్కువ మాట్లాడుతున్నావ్ ఏం చేస్తున్నావే అని కౌసల్య నీలిమని అంటుంది. ఇంతలో మల్లి ఇంటికి వస్తుంది. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి పొద్దున్నే ఇద్దరు ఎక్కడికి వెళ్లారు అని కౌసల్య అంటుంది. వాకింగ్ కి వెళ్ళాము అత్తయ్య అని మల్లి చెబుతుంది. సర్లే ఒక కాఫీ పెట్టి తీసుకురా అని కౌసల్య అంటుంది. మల్లి కాఫీ పెట్టడానికి వెళుతుంది. కిచెన్లోకి వెళ్లిన మల్లి ఆలోచిస్తూ కాఫీలో చక్కరకు బదులు ఉప్పు వేసి పోసుకొచ్చి కౌసల్యకి  ఇస్తుంది. కాఫీ తాగిన కౌసల్య పక్కకి  ఉంచి కాఫీలో  ఉప్పేసావేంటే  అని అంటుంది. లేదు అత్తయ్య నేను చెక్కరే వేశాను అని మల్లి అంటుంది. లేదు వదిన ఉప్పు వేశావు అని నీలిమా తాగి చెబుతుంది. ఏదో ధ్యాసలో పడి మర్చిపోయాను అని మల్లి అంటుంది. అంత పరధ్యానంలో ఎందుకు కాపీ పెట్టావే అని కౌసల్య ఉంటుంది. అత్తయ్య నిన్న ఒక నర్స్ కలిసి అరవింద్ బాబు బ్రతికే ఉన్నాడు హాస్పిటల్కి రా ఫుటేజ్ ఇస్తాననింది కానీ అక్కడికి వెళ్తే ఫుటేజ్ లేదు రిజిస్ట్రేషన్ పేపర్లు మాత్రమే ఉన్నాయని ఇచ్చింది అని ఆలోచించుకుంటూ మర్చిపోయి ఉప్పేసానని మల్లి అంటుంది. ఇక ఆపుతావా ఆ అరవింద్ భజన నీకు అరవింద్ కి పెళ్లి మాత్రమే అయ్యిందా ఇంకా ఏమైనా సంబంధం ఉందా అని కౌసల్య అంటుంది. కోపంతో రగిలిపోతున్న మల్లి.. కౌసల్య మీదికి చేయలేపుతుంది.

మరోవైపు నీలిమ ఈ విషయం మీ ఇంట్లో వాళ్లకు చెప్పేస్తే బాగుంటుందని బన్నీ అంటాడు. బన్నీ ఎవరైనా చూస్తే బాగోదు మా ఇంట్లో పరిస్థితులు ఇంకా సర్దుకోలేదు అని నీలిమ అంటుంది. ఏదో ఒక రోజు చెప్పాల్సిందే కదా అని బన్నీ అంటాడు. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగా మల్లి వాళ్ళని చూస్తుంది.  మల్లి  చూసిన నీలిమ బన్నీ మా వదిన చూసేసింది పద వెళ్లిపోదాం అని మొహానికి చున్నీ కట్టుకొని బైక్ వేసుకొని ఇద్దరూ మల్లికి దొరకకుండా వెళ్ళిపోతారు.నీలిమ ఆగండి అని మల్లి వాళ్ళ వెనకాలే పరిగెత్తుతుంది. అలా వెళ్తున్నాం మల్లి కి ఒకచోట గౌతమ్ కనిపిస్తాడు. దాంతో నిన్నటి ఎపిసోడ్ ముగుస్తుంది. మరి మీలో ఎంతమంది మల్లి సీరియల్ ని చూస్తున్నారో కామెంట్ చేయండి.