English | Telugu

మణికంఠ మాష్టర్ కి కోరియోగ్రఫీ ఛాన్స్ ఇచ్చిన లారెన్స్ మాష్టర్

కొరియోగ్రాఫర్ మణికంఠ మాష్టర్ గురించి బుల్లితెర మొత్తానికి బాగా తెలుసు.. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ చూసే ఆడియన్స్ కి కూడా బాగా పరిచయమే. ఎక్కువగా పిల్లలతో డాన్స్ లు చేయిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఢీ-13 లో మణికంఠ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తన తోటి కంటెస్టెంట్స్ కి కూడా ఒక ఇన్స్పిరేషన్ గా ఉండేవాడు. అప్పటి జడ్జి ప్రియమణి మణికంఠను జూనియర్ లారెన్స్ అని పేరు కూడా పెట్టింది. అలాంటి మణికంఠ మాష్టర్ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీలో కోరియోగ్రఫీ చేస్తూ ఉన్నాడు. ఇక ఇప్పుడు ఈ వారం ఎపిసోడ్ లో కూడా ముగ్గురు చిన్నారులకు డాన్స్ కోరియోగ్రఫీ చేసి అందరితో మంచి మార్క్స్ కొట్టేసాడు. ఇంద్రజ ఇక మణికంఠ పొగిడేసింది. " మీ లైఫ్ లోకి నిజంగా ఏంజెల్స్ వచ్చారు. మీరు ఎవరినైతే గాడ్ ఫాదర్ గా అనుకుంటున్నారో ఆయనతోనే పెర్ఫార్మ్ చేయించారు. ఇప్పుడు లారెన్స్ మాష్టర్ కూడా ఆయనకు మూవీ ఆఫర్ ఇప్పించారు" అంటూ ఈ సందర్భంగా ఒక విషయాన్ని కూడా రివీల్ చేసింది.

"లారెన్స్ మాష్టర్ నాకు ఒక సాంగ్ కోరియోగ్రఫీ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు. ఐతే ఆ ఛాన్స్ ఎలా ఇచ్చారంటే శ్రీదేవి డ్రామా కంపెనీలో నేను చేసే పెర్ఫార్మెన్స్, కోరియోగ్రఫీ చూసి ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్యూ సర్. ఇప్పటికి నేను ఈ స్టేజి మీదకు రావడానికి కారణం ఎవరు అనే విషయాన్నీ ఎపుడూ చెప్పలేదు. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అంటే దానికి కారణం పంచ్ ప్రసాద్. ఆయన ఎవరికీ తెలియకుండా చేశారు. కానీ ఈ విషయం ఇప్పుడు నేను అందరితో షేర్ చేసుకుంటున్నా.." అని చెప్పాడు మణికంఠ. "మణికంఠకు లారెన్స్ మాస్టర్ ఆఫర్ ఇవ్వడంలో ఏమాత్రం సంకోచం లేదు. ఎందుకంటే మనోడు ఏదైనా చేయగలడు..అటు సినిమా కోరియోగ్రఫీ ఐనా ఇటు స్టేజి కోరియోగ్రఫీ ఐనా చేయగలడు. కంగ్రాట్స్ బ్రదర్ ఆల్ ది బెస్ట్" అని చెప్పాడు హైపర్ ఆది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.