English | Telugu

కుర్చీ మడతపెట్టి లాస్యను చితగ్గొట్టిన మంజునాధ్..


కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ ఎఫెక్ట్ ఇప్పుడు అందరి ఇళ్ల మీద కూడా పడుతోంది. ఇంట్లో కూడా కుమారి ఆంటీ రీల్స్ చేస్తూ వాటిని ఇంకా ట్రెండ్ చేస్తున్నారు చిన్నా పెద్దా సెలబ్రిటీస్. ఇప్పుడు యాంకర్ లాస్య ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. తన భర్త మంజూనాథ్ డైనింగ్ టేబుల్ దగ్గరున్న కుర్చీని తీసుకుని లాస్యను కొడుతున్నట్టుగా ఉంది ఆ వీడియో.

ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది.ఇంతకు మంజూనాథ్.. లాస్యను కొట్టాడు, అసలు అతనికి కోపం తెప్పించేంత పని లాస్య ఏం చేసిందో తెలియాలి అంటే ఆ వీడియో చూస్తే తెలిసిపోతుంది. లాస్య తన భర్త మంజునాధ్ కి చేపల కూర వడ్డిస్తూ.. 'మీది మొత్తం థౌసండ్ అయ్యింది. రెండు లీవర్లు ఎక్స్ట్రా ' అని కుమారి ఆంటీ వాయిస్ రీల్ కి లిప్ సింక్ ఇచ్చేసరికి మంజునాధ్ కి మండిపోయింది. దీంతో మంజునాథ్ ఫన్నీగా లాస్యను కుర్చీతో కొట్టాడు. ఈ వీడియోని లాస్య పోస్ట్ చేసింది. "జస్ట్ ఫర్ ఫన్... మీరు ఈ ఫన్నీ వీడియోను ఇష్టపడతారనుకుంటున్నాను" అంటూ లాస్య క్యాప్షన్ పెట్టుకుంది. ఇక లాస్య ఇప్పుడు వెయిట్ లాస్ కావడానికి స్ట్రిక్ట్ గా డైట్ మెయింటైన్ చేస్తోంది. బేబీ పుట్టాక 66 కేజీలు పెరిగిపోయింది.

అందులో కొంతైనా తగ్గాలి అంటూ డైట్ తీసుకుంటున్నట్లు చెప్పింది. అలాగే ఆ డైట్ ని ఎలా ప్లాన్ చేసింది అనే విషయాలను జోడించి ఒక వీడియో చేసి తన యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. ఒకప్పుడు క్యూట్ యాంకర్స్ గా ఉండేవాళ్ళు లాస్య, రవి. వీళ్ళ జోడిని చూడడానికే ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడేవాళ్లు. మా టీవీలో వచ్చే సమ్ థింగ్ స్పెషల్ షోతో ఈ ఇద్దరూ ఫుల్ ఫేమస్ అయ్యారు. ఆడియన్స్ కి ఏనుగు- చీమ జోక్స్ చెప్తూ ఎంటర్టైన్ చేసేది. ఇక లాస్య.. మంజునాధ్ ని లవ్ మ్యారేజ్ చేసుకుని సెటిల్ ఐపోయింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.