English | Telugu

నెక్స్ట్ జన్మలో మొగుడేవరంటూ జాతకం చెప్పించుకున్న సుమ

జీ తెలుగులో "కుటుంబం కిస్మత్ కనెక్షన్స్" పేరుతో త్వరలో ఒక షో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇందులో జాతకాలు చూడడం అనే కాన్సెప్ట్ తో తీసుకొస్తున్నారు. ఇక ఇందులో బుల్లితెర నటీనటులంతా వచ్చి వాళ్ళ వాళ్ళ ప్రెడిక్షన్స్ ని చెప్పించుకున్నారు. ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, పెళ్లిళ్లు ఎప్పుడవుతాయి వంటి ఎన్నో ప్రశ్నలకు ఆన్సర్స్ ని కూడా ఈ షోలో తెలుసుకున్నారు. ఇందులో నిరుపమ్, మంజుల పరిటాల వచ్చారు. నిరుపమ్ చేతి రేఖలు చూసిన ప్రెడిక్షన్ చెప్పడానికి వచ్చిన మనీష్ అనే అమ్మాయి షాకైపోయింది.

"అసలేంటి ఇన్ని గీతలు ఉన్నాయి" అని అడిగేసరికి "దేవుడు ఎక్స్ట్రా గీతలన్నీ నా చేతిలోనే వేసేశాడు" అని చెప్పాడు నిరుపమ్. తర్వాత మంజుల చేతి రేఖలు చూసి "మేడం చెయ్యి చాలా బాగుంది. ఆవిడ చేతి రేఖలు బాగున్నాయి కాబట్టి మీకు చాల బాగుంది" అని చెప్పింది. తర్వాత చందు గౌడ వచ్చేసరికి "మీరు బుల్లితెర నుంచి వెండి తెర మీదకు అరంగేట్రం చేస్తున్నారు.. "మీకు మీ జీవితంలో ఒక ఖరీదైనది రాబోతోంది" అని చెప్పేసరికి "ఇంకో కొత్త బైక్ కొంటున్నాను" అని చెప్పాడు. ఇక సుమ కనకాల, రాజీవ్ కనకాల ఇద్దరూ వచ్చేసరికి "మీరు ఎం తెలుసుకోవాలని అనుకుంటున్నారు" అని ప్రెడిక్షన్ చెప్పే అమ్మాయి అడిగేసరికి "నెక్స్ట్ జన్మలో నా మొగుడు ఎవరో తెలుసుకుందామని" వచ్చాను అంది సుమ. "ఏడేడు జన్మలకు రాజీవ్ గారే మీ భర్త . ఇంకా కొన్నేళ్ల వరకు మీరే యాంకర్..ఆ బ్రాండ్ మీరు అలా ఫిక్స్ చేసేసారు" అని చెప్పింది ఆ అమ్మాయి మనీష..ఇక రౌడీ రోహిణి జాతకం చూసి ఆమె ఫ్యూచర్ వెలిగిపోతుంది అని చెప్పింది. ఇలా ఈ షో త్వరలో రాబోతోంది. మరి ఈ షో వస్తే ఎవరెవరి జాతకాలు ఏంటో తెలిసిపోతాయి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.