English | Telugu

బట్టలెక్కువ వేస్కుంటే  వాళ్ళే విజేత.. ఇదెక్కడి టాస్క్ రా సామి!

బిగ్ బాస్ సీజన్-7 ప్రేక్షకులకి వినోదాన్ని పంచుతు వస్తుంది. అయితే రోజుకో టాస్క్ తో కంటెస్టెంట్స్ నుండి వీలైనంత ఎంటర్టైన్మెంట్ ని బయటకు తెప్పిస్తున్నాడు బిగ్ బాస్.

మొదటి రోజు జరిగిన టస్క్ లో.. పల్లవి ప్రశాంత్, ప్రియాంక జైన్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు జరిగిన టాస్క్ లలో మొదటి గేమ్ గౌతమ్ కృష్ణ గెలిచాడు. రెండవ గేమ్ లో ప్రిన్స్ యావర్, టేస్టీ తేజ, శోభాశెట్టి పాల్గొన్నారు. అయిదుగురికి ఒక టాస్కు పెట్టాడు బిగ్‌బాస్. తేజ, యావర్, అర్జున్, అశ్విని, శోభాలలో చర్చించుకొని కేవలం ముగ్గురే ఈ గేమ్ ఆడాలి. ఇందులో ఎవరు గెలిస్తే వారు మరో కెప్టెన్సీ కంటెండర్ అవుతారన్నమాట. అయితే శోభా గొడవ తట్టుకోలేక అర్జున్, అశ్విని పోటీ నుంచి తప్పుకొని యావర్, తేజ, శోభాలను గేమ్ కోసం పంపించారు. ఇక ఈ గేమ్ గెలవడానికి వీలైనన్నీ ఎక్కువ బట్టలు వేసుకోవాల్సి ఉంటుందని బిగ్ బాస్ కోరాడు.

ఇక ఈ ఆటకి సంచాలకుడిగా శివాజీ ఉన్నాడు. వీలైనన్ని బట్టలు వేసుకోమని బిగ్ బాస్ చెప్పగా.. టేస్టీ తేజ హౌస్ లో ఎవరి బట్టలు వదలలేదు, టీ షర్ట్, షర్ట్, ప్యాంట్, పంచె, డ్రాయర్ ఇలా ఏది పడితే అది వేసుకున్నాడు. దేన్ని వదలలేదు. అన్ని వేసుకున్న ఈ టాస్క్ లో ఓడిపోయి కంటెండర్ పోటీ నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత శోభాశెట్టి 72 రకాల బట్టలు వేసుకొని మొదటి స్థానంలో ఉండగా, 70 రకాల బట్టలు యావర్ వేసుకొని రెండవ స్థానంలో నిలిచాడు. దీంతో కెప్టెన్సీ కోసం పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, ఆట సందీప్, శోభాశెట్టి, ప్రియాంక జైన్ చివరి టాస్క్ ఆడాల్సి ఉంది. మరి వీరిలో ఈ వారం ఎవరు కెప్టెన్సీగా గెలుస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.