English | Telugu

దుర్గమ్మ మాలలో ముద్దమందారం నీలాంబరి


సునంద మాలశెట్టి తెలుగు సీరియల్స్ నటిస్తూ ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. ఆమె ముద్ద మందారం సీరియల్ లో నీలాంబరి రోల్ ద్వారా ప్రతీ తెలుగు ఇంటికి పరిచయమయ్యారు. ఆ తర్వాత నిన్నే పెళ్లాడతా, నా పేరు మీనాక్షి, పవిత్ర బంధం, హిట్లర్ గారి పెళ్లాం మొదలైన సీరియల్స్‌లో నటించింది. 2008లో సునంద ఆటా జూనియర్స్ షోలో ఒక టీములో డాన్సర్‌గా తన కెరీర్ ని స్టార్ట్ చేసింది. అలాగే ఎన్నో డాన్స్ షోస్ కూడా ఇచ్చింది.

కాకినాడలో జరిగిన గోకులంలో సీత సీరియల్ ఆడిషన్స్ కి వెళ్లి సెలెక్ట్ అయ్యింది. ఈ సీరియల్‌ ద్వారా ఆమె తెలుగు టీవీ ఇండస్ట్రీలోకి తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఇక ఈమె డిసెంబర్ 17, 2022న శంకర్‌ని పెళ్లి చేసుకుంది. అలాంటి సునంద ఇప్పుడు దుర్గమ్మ మాలలో కనిపించారు. ఆ వీడియోని ఆమె తన యూట్యూబ్ లో పోస్ట్ చేశారు.

లాస్ట్ టైం కూడా వేసుకున్నానని ఐతే అప్పుడు తన అమ్మమ్మ ఇంట్లో దుర్గా దేవి దగ్గ్గర అలంకరణ అంతా చేస్తే తానూ మాత్రం గుడికి వెళ్లి వచ్చినట్లు చెప్పారు. కానీ ఇప్పుడు తన అమ్మమ్మ లేరని చెప్పారు. అలాగే ఇది రెండో సారి మాల వేసుకుంటున్నట్లు చెప్పారు. ఇక ఇంటికి వచ్చి అమ్మవారికి ఎలా పూజ చేసుకున్నారో చూపించింది సునంద. తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా అమ్మవారిని స్మరించుకోవాలి అని చెప్పింది. ఇక మొదటి సారి అత్తగారింటిలో రెండో సారి పుట్టింట్లో ఈ మాల వేసుకున్నట్లు చెప్పింది. అలాగే తనకు తన అమ్మమ్మ నేర్పించిన విధానంలో తనకు వచ్చినట్టుగా అమ్మవారికి పూజ చేసుకున్నది సునంద.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.