English | Telugu

వాళ్ళు తప్పు చేశారు.. భవాని ఏ శిక్ష వేస్తుందోనని రేవతి టెన్షన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్‌ -151లో.. భవాని తీవ్రంగా ఆలోచిస్తుంటుంది. ముకుంద చెప్పిన మాటలన్నీ పదే పదే గుర్తుచేసుకుంటూ కృష్ణపై కోపాన్ని పెంచుకుంటుంది భవాని. మరోవైపు భవాని దగ్గరికి రేవతి వస్తుంది. అక్కా అని రేవతి పిలవగానే.. ఏంటి చెప్పు అని భవాని అడుగుతుంది. ఏంటక్కా అంత సీరియస్ గా ఉన్నారని రేవతి అడుగగా.. విషయమేంటో సూటిగా చెప్పమని భవాని అంటుంది. మీకు వ్యతిరేకంగా కృష్ణ, మురారి ప్రవర్తించడం తప్పే అక్క అని అనగా.. తప్పని ఒప్పుకున్నావ్ కదా.. ప్రాయశ్చిత్తం కచ్చితంగా జరుగుతుంది వెళ్లమని భవాని అంటుంది. ఆ తర్వాత రేవతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

కాసేపటికి భవాని గదిలోకి కృష్ణ వస్తుంది. క్షమించండి అత్తయ్య.. మీ ఆజ్ఞ అతిక్రమించి వచ్చాను.‌. వెళ్తాను అత్తయ్య కానీ చెప్పాల్సింది చెప్పి వెళ్తాను.‌ ఏసీపీ సర్ ఏ తప్పు చేయలేదు.. ఈ ప్రపంచంలో ఏసీపీ సర్ కి మీ తర్వాతే ఎవరైనా.. మీరు ఏసీపీ సర్ తో మాట్లాడాలంటే ఏం చెయ్యాలని కృష్ణ అనగా.. నేను చెప్పిందే జరుగుతుందని భవాని అంటుంది. అయినా మురారి కూడా నీ మాట వినడం తప్పే కదా.. ఆ తప్పుకి శిక్ష వేసింది అత్తయ్య అని కృష్ణతో ముకుంద అంటుంది. నువ్వు చేసిన పనికి ఇంకెవరైనా అయితే ఇంట్లో నుండి గెంటేసేవారని చెప్తుంది ముకుంద. అవును అదే పని జరుగుతుంది.. ఇంకో క్షణం నా గదిలో ఉంటే మెడపట్టుకొని బయటకు గెంటేస్తానని భవాని అంటుంది. తర్వాత కృష్ణ అక్కడ నుండి వెళ్తుంది. మరోవైపు మురారి తన గదిలో ఉండి.. కృష్ణతో జరిగిన సంఘటనలన్నీ తలుచుకొని మురిసిపోతుంటాడు. అప్పుడే కృష్ణ అన్నం తీసుకుని వస్తుంది. ఏసీపీ సర్.‌. మీ కోసం పప్పు, చేపల ఫ్రై తీసుకొచ్చాను.. నా చేతితో తినిపిస్తానని కృష్ణ మురారికి ప్రేమతో అన్నం కలిపి తినిపిస్తుంది. ఇక ముకుంద తన గదిలో కూర్చొని.. ఫోన్ లో మురారితో తను కలిసి ఉన్న ఫోటోని చూస్తూ.. మీ ఇద్దరి పెళ్ళి నిజం కాదని భవాని అత్తయ్యకి చెప్పి ఆ కృష్ణని పంపించేస్తాను.. ఆ తర్వాత మనమిద్దరం హ్యాపీగా ఉందామని ముకుంద అనుకుంటుంది.

మరోవైపు రేవతి టెన్షన్ పడుతుంది. అసలు భవాని అక్క ఎందుకు అంత కోపంగా ఉంది.. ముకుంద చెప్పిన మాటలని వింటుందా? కృష్ణ, మురారిలను విడదీస్తుందా? కృష్ణ ఎందుకు అంత మురిసిపోతుంది? పెళ్ళి చేసుకునున్నవాళ్ళు బాగానే ఉన్నారు.. మధ్యలో మంచిచేసిన నా కొడుకు కోడలితో మాట్లాడదంటే ఎలా అని ఆలోచిస్తుంటుంది రేవతి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.