English | Telugu

స్విమ్మింగ్ వచ్చని మురారికి అబద్ధం చెప్పిన కృష్ణ! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -196 లో.. ముకుంద ఉన్న గది ముందు చెప్పులు ఉండడంతో కృష్ణకి డౌట్ వస్తుంది. లోపల ఎవరో ఉన్నారని అదే విషయం భోజనం చెయ్యడానికి కూర్చున్న మురారిని కృష్ణ అడుగుతుంది. ఏసీపీ సర్ ఇక్కడ మనం కాకుండ ఎవరో ఉన్నారని అనగానే.. ముకుంద నే వచ్చి ఉంటుందని మురారి టెన్షన్ పడతాడు. కృష్ణ ని ఆ మ్యాటర్ నుండి డైవర్ట్ చెయ్యడానికి ట్రై చేస్తాడు మురారి. కృష్ణ మాత్రం అటు తిరిగి ఇటు తిరిగి ఎవరో ఉన్నారని అంటుంది. ఎవరు లేరు నువ్వు ముందు భోజనం చెయమని కృష్ణకి అన్నం తినిపిస్తాడు మురారి.

కాసేపటికి రాజనర్స్ దగ్గరికి మురారి వస్తాడు. ఇక్కడ మనం కాకుండ ఇంకా ఎవరైనా ఉన్నారా అని మురారి అడుగుతాడు. రాజనర్స్ టెన్షన్ గా నిజం చెప్పకూడదని మనసులో అనుకుంటుంది. ఎవరు లేరు సర్ అని రాజనర్స్ చెప్తుంది. కృష్ణకి గది ముందు ఎవరివో అమ్మాయి చెప్పులు కన్పించాయట అని మురారి అడుగుతాడు. లేదు సర్.. ఒక మేడం భవాని తాలూకూ ఒక రోజు వచ్చి వెళ్లిపోయింది.. ఆవిడే ఆ చెప్పులు మర్చిపోయి ఉంటుందని రాజనర్స్ చెప్పి వెళ్ళిపోతుంది. మురారికి మాత్రం రాజనర్స్ ఏదో దాస్తూన్నట్లు అనిపిస్తుంది. ఏది ఏమైనా సరే కృష్ణకి దగ్గర అవడానికె ట్రై చేస్తానని మురారి అనుకుంటాడు. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి మురారి వస్తాడు. నీకు స్విమ్మింగ్ వచ్చా కృష్ణ అని మురారి అడుగుతాడు. రాదు అంటే ఎక్కడ చులకన అవుతానో‌ అని కృష్ణ వచ్చని చెప్తుంది. సరే రేపు ఉదయం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్దామని మురారి అంటాడు. ఆ తర్వాత కృష్ణ అనవసరంగా అబద్ధం చెప్పనా అని టెన్షన్ పడుతుంది.

మరొక వైపు ముకుంద చెప్పకుండా వెళ్లింది. వెళ్తున్నా అని నాకు చెప్తే బాగుండేది కదా అని రేవతి ఆలోచిస్తుంది.. అప్పుడే అలేఖ్య వచ్చి అత్తయ్య రీల్స్ తీద్దామా అని అడుగుతుంది. రేవతికి కోపం వచ్చి నీకు రీల్స్ కావాలా అని అలేఖ్య చెవి మెలివేస్తుంది. మరొక వైపు స్విమ్మింగ్ దగ్గరికి కృష్ణ, మురారి వస్తారు. ఇప్పుడు వద్దు ఏసీపీ సర్ అని కృష్ణ అంటుంది. ఇప్పుడే చెయ్యాలని మురారి అంటాడు. ఆ తర్వాత మురారిని కృష్ణ వాటర్ లో నెట్టి వేస్తుంది. కాసేపటికి కృష్ణ చెయ్యి పట్టుకొని మురారి వాటర్ లోకి లాగేస్తాడు. సర్ నాకు స్విమ్మింగ్ రాదని కృష్ణ అరుస్తుంటే మురారి వెళ్లి కాపాడతాడు. కృష్ణని ఎత్తుకొని మురారి తీసుకొని వెళ్తుండగా ముకుంద ఎదురుపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.