English | Telugu

Eto Vellipoindhi Manasu : ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. అదేంటో తెలుసా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -50 లో....ఇంట్లో రామలక్ష్మి లేదని‌ ఎక్కడికి వెళ్లిందని పింకీని‌ మాణిక్యం అడుగుతాడు. అప్పుడే రామలక్ష్మి వస్తుంది.. నీ గురించి ఇప్పుడే పింకీని అడుగుతున్నానని మాణిక్యం అంటాడు. రామలక్ష్మి వచ్చి నేను సీతాకాంత్ సర్ తో పెళ్లికి ఒప్పుకుంటున్నా అని అనగానే మాణిక్యం చాలా సంబరపడతాడు.

ఆ తర్వాత వాళ్ళ అమ్మ సుజాత వచ్చి.. నువ్వు ఎందుకు ఒప్పుకుంటున్నావని అడుగుతుంది. మీ నాన్న కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావా అంటు రామలక్ష్మిని సుజాత కోప్పడుతుంది. ఆ తర్వాత సీతాకాంత్ వాళ్ళ తాతయ్య మాణిక్యం దగ్గరికి వచ్చి.. రామలక్ష్మితో పెళ్లికి ఒప్పుకున్నాడని చెప్పగానే మాణిక్యం నమ్మడు
అంత ఈజీగా అల్లుడు ఒప్పుకుంటాడని అనుకోవడం లేదు. నేను నమ్మను వీడియో కాల్ చెయ్యండి.. అల్లుడు వీడియో కాల్ లో చెప్తేనే నేను నమ్ముతానని మాణిక్యం అంటాడు. పెద్దాయన సీతాకాంత్ కి వీడియో కాల్ చేస్తాడు. అప్పుడు సీతాకాంత్ మాణిక్యంతో రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంటున్నా అని చెప్పగానే మాణిక్యం ఆనందానికి అవధులు లేకుండా పోతాయి.. ఆచారం ప్రకారం మేమే మీ ఇంటికి వచ్చి పెళ్లి గురించి మాట్లాడతామని పెద్దాయనకి మాణిక్యం చెప్తాడు.

ఆ తర్వాత రామలక్ష్మి, తన అమ్మ‌ సుజాత, పింకీలు సీతాకాంత్ ఇంటికి వస్తారు. ఆ తర్వాత ధన, మాణిక్యం లు వస్తారు. సెక్యూరిటీ లోపలకు రానివ్వడు. శ్రీలతకి సెక్యూరిటీ ఫోన్ చేసి.. మాణిక్యం అంట వచ్చారని అనగానే లోపలికి పంపొద్దని శ్రీలత చెప్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ కి రామలక్ష్మి ఫోన్ చేస్తుంది. సీతాకాంత్ సెక్యూరిటీతో మాట్లాడతాడు. ఆ తర్వాత అందరు లోపలికి వెళ్తారు. సీతాకాంత్ రామలక్ష్మిపై ప్రేమని తనలోనే దాచుకుంటాడు. ఆ తర్వాత ఇక్కడ మేకొకటి చూపించాలంటు మాణిక్యం తన కుటుంబాన్ని తీసుకొని ఆ ఇంట్లో ఉన్నా తన పెద్ద ఫోటో దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అది చూసి వాళ్ళంత షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.