English | Telugu

Krishna Mukunda Murari : ఆటపాటలతో ఆ ఫ్యామిలీ.. ముకుంద అంతరార్థం అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -366 లో.. అందరు రెడీ అయి భోగి మంటల దగ్గరికి వస్తారు. శకుంతల సంతోషంగా భోగి మంటల కోసం ఏర్పాట్లు చేస్తుంది.. అప్పుడే భవాని కూడా వస్తుంది. అందరు సరదాగా జోక్స్ వేసుకుంటూ ఉంటారు. ముకుంద ఒక్కతే ఇంట్లో ఉండి చూస్తు ఉంటుంది. ముకుందని చూసిన కృష్ణ.. అత్తయ్య ముకుంద ఒక్కతే ఇంట్లో ఉంది. పాపం ఫీల్ అవుతుంది. నేను వెళ్లి తీసుకొని వస్తానంటూ కృష్ణ వెళ్తుంది.

ఆ తర్వాత ముకుందని కృష్ణ రమ్మని పిలుస్తుంది. నేను రాను అక్కడ నీకు ఒకదానికే నేను ఇష్టం.. ఎవరికి నేను ఇష్టం లేనని ముకుంద అంటుంది. అలా ఎం లేదని కృష్ణ చెప్పి ముకుందని తీసుకొని వస్తుంది. ఆ తర్వాత అందరు సరదాగా డాన్స్ చేస్తుంటారు. కృష్ణ, మురారి మాత్రం మాస్టారు మాస్టారు అంటూ రొమాంటిక్ గా డాన్స్ చేస్తుంటారు. ఆ తర్వాత నందు, గౌతమ్ లు చెయ్యగా.. కాసేపటికి షకుంతల కూడా డాన్స్ చేస్తుంటుంది. తను డ్యాన్స్ చేస్తుండటం చూసి అందరు ఆశ్చర్యంగా చూస్తుంటారు. చివరగా అందరు కలిసి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు.

ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం కృష్ణ లేచి ముగ్గు వేస్తుంటే తన దగ్గరికి మురారి వచ్చి... కృష్ణని పొగుడుతూ ఉంటాడు. చాలా అందంగా ఉన్నావంటూ కృష్ణని పొగుడుతూ ఉంటాడు. ఆ తర్వాత రేవతి పెద్దమ్మ నువ్వు ఈ రోజు చాలా అందంగా ఉన్నావ్. ఈ చీరతోనే వచ్చిన అందం కాదు.. నీ కొడుకు కోడలు కలిసిపోయారు దానివల్ల వచ్చిన అందమేమోనని మధు అంటాడు. ఆ తర్వాత నువ్వు మా అమ్మవి అని రేవతిని కృష్ణ హగ్ చేసుకుంటుంది. అందరు రెడీ అయి వచ్చి సరదాగా మాట్లాడుకుంటు ఉంటారు. సరదాగా ఈరోజు అరిటాకులో కింద కూర్చొని భోజనం చేద్దామని భవాని అంటుంది. ఆ తర్వాత భవాని అందరికి భోజనం వడ్డీస్తుంది. మురారి, మధు ఇద్దరు సెటైర్ లు వేస్తుంటే.. నువ్వు వడ్డించు అంటు కృష్ణకి భవాని ఇస్తుంది. తరువాయి భాగంలో కృష్ణ, మురారి ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. కృష్ణ హారతి ఇస్తు ముకుందకి పట్టుకోమని ఇస్తుంది. అప్పుడే దీపం ఆరిపోతుంది. అందరు షాక్ అవుతారు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.