English | Telugu

రిషిని కాపాడుకున్నామని చెప్పిన ఏంజిల్.. షాక్ లో వసుధార, జగతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -817 లో.. మహేంద్రని రిషి డాడ్ అని పిలవడంతో ఏంజిల్ విని ఆశ్చర్యపోతుంది. డాడ్ అని పిలిచావ్ కదా అని రిషిని అడుగుతుంది. లేదని రిషి చెప్తాడు. అక్కడే ఉన్న వసుధార, జగతి, మహేంద్రలను ఏంజిల్ అడుగుతుంది. వాళ్ళు కూడా అనలేదని చెప్పగానే నాకు ఏమైనా చెవులు వినిపిస్తలేవా అని ఏంజిల్ అంటుంది. అప్పుడే విశ్వనాథ్ వస్తాడు. రిషి పిలిచిన విషయం విశ్వనాథ్ కి ఏంజెల్ చెప్తుంది. డాడ్ అని పిలిస్తే తప్పేముందని విశ్వనాథ్ అంటాడు.

ఆ తర్వాత జగతిని తన గదిలోకి తీసుకొని వెళ్తుంది వసుధార. వసుధార నన్ను క్షమించు అని జగతి అంటుంది. అలా అనకండి. మీరు అడిగారు నేను చేశాను. అందుకే నా జీవితం ఇప్పుడు ఇలా ఉందని వసుధార కోప్పడుతుంది. నేను ఆ విషయంలో తప్పు చేశాను. నేను అప్పుడు రిషిని కాపాడుకోవాలని మాత్రమే ఆలోచించానని జగతి అంటుంది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు అనుకుంటే లాభం లేదని వసుధార అంటుంది. మీరు అతిదులుగా వచ్చారు.. ఒకరికొకరు తెలియనట్లే ఉందామని వసుధార అంటుంది. ఆ తర్వాత అందరూ భోజనం చేస్తుంటారు. ఇలా అందరు ఒక దగ్గర చేరి భోజనం చేయడం హ్యాపీగా ఉందని విశ్వనాథ్ అంటాడు. రిషి ఆ కర్రీ వేసుకో.. నీకు ఇష్టం కదా అని మహేంద్ర అంటాడు. రిషికి ఆ కర్రీ ఇష్టమని మీకెలా తెలుసని ఏంజిల్ అడుగుతుంది. వాళ్లకి ముందే పరిచయం ఉంది కదా చాలాసార్లు కలిసి భోజనం చేసి ఉండొచ్చు కదా అని విశ్వనాథ్ అంటాడు. మిమ్మల్ని చూస్తుంటే అందరూ ఒకే కుటుంబం లాగా అనిపిస్తున్నారని ఏంజిల్ అనగానే.. అందరూ షాక్ అవుతారు. సర్ మీరు మీ ఇంట్లో అందరూ కలిసే భోజనం చేస్తారా అని ఏంజిల్ అడుగుతుంది. అవును అందరం కలిసి వెన్నెలని చూస్తూ నేలపై కూర్చొని భోజనం చేస్తామని మహేంద్ర అంటాడు. రిషి అలా అందరు కలిసి భోజనం చేసిన దానిని గుర్తు చేసుకుంటాడు. సరే రేపు కూడా మనం అలాగే వెన్నెలని చూస్తూ భోజనం చేద్దామని ఏంజిల్ అంటుంది. సరే అని విశ్వనాథ్ అంటాడు.

ఆ తర్వాత అందరూ హాల్లో కూర్చొని కాలేజీ గురించి మాట్లాడుకుంటారు. మీ కాలేజీ అంత పెద్ద స్థాయికి రావడానికి కారణం ఏంటని విశ్వనాథ్ మహేంద్రని అడుగుతాడు. మా ఎండి సర్ వళ్లే అదంతా అని మహేంద్ర చెప్తాడు. కాసేపటికి అందరూ వెళ్ళిపోయాక వసుధార, ఏంజెల్, జగతి కలిసి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటారు. రిషి తనకి ఎప్పటి నుండి పరిచయమని ఏంజిల్ జగతితో చెప్తుంది. రిషి ని ఎవరో కత్తితో పొడిచారు. హాస్పిటల్ లో ఉంటే విశ్వం, నేను వెళ్లి రిషిని కాపాడుకున్నామని ఏంజిల్ అనగానే జగతి, వసుధారలు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.