English | Telugu

ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి కథ..

బిగ్ బాస్ సీజన్ 6 అలా చక్కగా సాగిపోతోంది. ఐతే బిగ్ బాస్ ఈసారి హౌస్ మేట్స్ వాళ్ళ వాళ్ళ జీవితాల్లో పడిన ఇబ్బందులను చెప్పమని అడిగేసరికి అందరూ వాళ్ళ వాళ్ళ ఎమోషనల్ స్టోరీస్ చెప్పుకొచ్చారు. ముందుగా సుదీప మాట్లాడింది . తాను ప్రెగ్నెంట్ గా ఉన్న టైములో థైరాయిడ్ సమస్య వల్ల బేబీని పోగొట్టుకోవాల్సి వచ్చిందని ఏడుస్తూ చెప్పింది. ఇక కీర్తి మాట్లాడుతూ తన జీవితంలో ఎదురైన భయంకరమైన సంఘటనలు గురించి చెప్పింది . దేవాలయానికి వెళ్లి వస్తూ.. తన కుంటుంబం అంతా కారు యాక్సిడెంట్ లో మరణించారని. ఫ్యామిలీ మొత్తం మీద తాను ఒక్కతినే బతికాకాని అసలెందుకు ఎందుకు బతికానురా దేవుడా అనుకున్నానంటూ ఏడ్చేసి.. హౌస్ లో అందరిని ఏడిపించేసింది కీర్తి. బంధువులు కూడా తన ఆస్తిని తీసుకుని తనను రోడ్డు మీద వదిలేశారంటూ బాధపడింది.

ఇంట్లో వాళ్లంతా చనిపోయాక ఒక పాపను దత్తత తీసుకుందని చెప్పింది. తాను బిగ్ బాస్ హౌస్ కు వచ్చే ముందు ఆ బిడ్డకు వచ్చిన అనారోగ్య సమస్య వలన ఆమె కూడా చనిపోయిందని చెప్పింది. పోనీ పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారనే ఆశ కూడా లేదని ఎందుకంటే యాక్సిడెంట్ లో తన గర్బసంచి తీసేశారంటూ.. కీర్తి చెపుతుంటే.. హౌస్ లో అందరూ ఎమోషనల్ అయ్యారు. ఇక హౌస్ లో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ గా ఉన్న మెరీనా జంట కూడా ఎమోషనల్ స్టోరీ చెప్పారు. మెరీనాకు రెండు సార్లు అబార్షన్ అయ్యిందని. లాక్ డౌన్ టైంలో చాలా నరకం చూసిందని కన్నీళ్లు పెట్టుకుని చెప్పాడు రోహిత్. మరో పక్క సింగర్ రేవంత్ వాళ్ళ స్టోరీ వింటూ చాలా బాధపడ్డాడు. ఇక అభినయశ్రీ ఈసారి మంచి పాప పుడుతుంది అంటూ రోహిత్, మెరీనాకు ధైర్యం చెప్పింది . ఇలా హౌస్ మేట్స్ అంతా వాళ్ళ వాళ్ళ ఎమోషనల్ స్టోరీస్ ని చెప్పుకొచ్చారు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.