English | Telugu

కోల్గేట్ పేస్ట్‌పై వేప పుల్లతో కౌశల్ పోరాటం!


కౌశల్ మందా గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే అత్యధిక ఫాలోయింగ్ ని సంపాదించుకున్న కంటెస్టెంట్‌గా కౌశల్ మందా. కౌశల్ ఆర్మీ కూడా అప్పట్లో బాగా ఫేమస్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 2 టైములో కౌశల్ ఇమేజ్ ఓ రేంజ్ లో ఉండేది. ఆయన కోసం అప్పట్లో చాలా కార్యక్రమాలు చేసారు. తనను తాను ఓ హీరోలా ప్రొజెక్ట్ చేసుకున్నాడు కౌశల్. నానిపై కూడా కౌశల్ అభిమానులు ఫైర్ అయ్యే రేంజ్ లో ఉంది కౌశల్ పవర్ . అలాంటి కౌశల్ తర్వాత కొన్ని షోస్ చేసాడు. తన ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్స్ పెడుతూ ఉంటాడు. వాళ్ళ పిల్లల్తో కలిసి చేసిన వీడియోస్ ని కూడా షేర్ చేస్తూ ఉంటాడు.

రీసెంట్ గా అలాంటి ఒక వీడియోని పోస్ట్ చేసాడు . వాళ్ళ అమ్మాయిని వేప చెట్టు దగ్గరకు తీసుకువెళ్లి అక్కడ వేప పుల్ల విరిచి చేతికి ఇచ్చాడు. ప్రపంచంలోకి ఇదే బెస్ట్ టూత్ పేస్ట్ అని చెప్పాడు. వారానికి ఒక్కసారైనా వేప పుల్లతో పళ్ళు తోముకుంటే పళ్లలో ఉండే బాక్టీరియా అంతా చచ్చిపోతుంది అని చెప్పాడు. ఇక తన కొడుకు, కూతురు, మరో బాబుకు కూడా వేప పుల్లలు ఇచ్చి పళ్ళు తోమించాడు. మా తాతల టైంలో ఈ వేపపుల్లలతోనే తోముకునే వాళ్ళు, తర్వాత బొగ్గుతో తోముకునే వాళ్ళు, ఆ తర్వాత పేస్ట్ లు వచ్చాయి అని తన కూతురికి ఎక్స్ప్లైన్ చేసాడు. ఈ వీడియో చూసాక నెటిజన్స్ అంతా కూడా తమ చిన్నప్పుడు వేప పుల్లతోనే పళ్ళు తోముకునే వాళ్ళం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.