English | Telugu
ఫ్యామిలీకి దీప గురించి చెప్పిన సౌందర్య.. షాక్లో కార్తీక్!
Updated : Mar 9, 2021
'కార్తీక దీపం' ఎండ్ స్టేజ్కి వచ్చేసిందా? అంటే జరుగుతున్న పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి. మంగళవారం ఎపిసోడ్ మరింత కీలక మలుపు తిరగబోతోంది. డాక్టర్ బాబు ఎంత చెప్పినా వినకపోవడంతో విసుగెత్తిన దీప తన పిల్లలని తీసుకుని వారణాసి ఆటోలో వేరే ఊరు వెళ్లిపోతుంది. ఉంటున్న ఇల్లు ఖాళీ చేసి పిల్లలతో సహా ఊరు మారుతుంది. పాత ఇల్లు, కొత్త వాతావరణం.. సోఫాలో కూర్చుని దీప ఆలోచిస్తుంటే.. హిమ, శౌర్య ఫొటోలు తీసి తుడుస్తూ వుంటారు.
"అమ్మా ఇక్కడ ఏయిర్ పోర్ట్ వుందా?" అని దీపని అడుగుతుంది శౌర్య. దీప "ఎందుకు అత్తమ్మా" అంటుంది. "నాన్న రావాలనుకుంటే.." అని నసుగుతుంది శౌర్య. దీంతో దీపకు పట్టరాని కోపం వచ్చేస్తుంది. "మాటి మాటికి నాన్నా.. నాన్నా అనకండి. మీ జీవితంలో నాన్న అధ్యాయం ముగిసిపోయింది." అంటూ మండిపడుతుంది. దీప కోపం చూసి పిల్లలు ఆశ్చర్యపోతారు. కట్ చేస్తే ఆనందరావు కోడలు దీపని, పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చేద్దామని సౌందర్యతో చెబుతాడు.
పెద్దోడికి ఈ విషయం నువ్వే చెప్పాలంటాడు. ఈ సంభాషణ జరుగుతుండగానే కార్తీక్ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. "ఏంటీ ఏదో చెప్పాలంటున్నారు?" అని అడిగితే, "అది మీ అమ్మే చెబుతుంది" అంటాడు ఆనందరావు. అయినా చెప్పమనడంతో "కోడలుని ఇంటికి తీసుకొచ్చేద్దాం రారా కార్తీక్" అంటాడు. "మీరు ఆవేశపడకండి" అంటుంది సౌందర్య. "అదేంటి నువ్వే కదా నాన్నని ఫోర్స్ చేయాలి. మరి నువ్వేంటి వద్దని వారిస్తున్నావ్" అంటాడు కార్తీక్.
ఎంతకీ ఆనందరావు వినకపోవడంతో దీప లేదనీ, ఊరు వదిలి ఎక్కడికో వెళ్లిపోయిందని సౌందర్య చెప్పేస్తుంది. దీంతో షాక్ కు గురైన ఆనందరావు కార్తీక్ చేయి వదిలేసి సోఫాలో కుప్పకూలిపోతాడు.. తల్లి చెప్పిన మాటలు వినిని ఒక్కసారిగా షాకైన కార్తీక్ శూన్యంలోకి చూస్తూ మెట్లపై అచేతనంగా కూర్చుండి పోతాడు. ఇది ఈ రోజు ఆసక్తికర ఎపిసోడ్.