English | Telugu

Karthika Deepam 2: దీప వారసురాలని ఎవరితో చెప్పకు.. దాసుతో కార్తీక్ ఒప్పందం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం-2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్‌-354లో.. దీపే అసలైన వారసురాలని చెప్పేస్తానని, నేను బతికి ఉంటే ప్రమాదమని జ్యోత్స్న నన్ను చంపాలనుకుందని కార్తీక్‍తో దాసు అంటాడు. తనను తలపై కొట్టిందని చెప్తాడు. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. నేను తన కన్నతండ్రినని తెలిసి చంపాలనుకుందంటే అసలైన వారసురాలిని వదిలిపెడుతుందా అని కార్తీక్ తో దాసు చెప్తాడు. దీంతో కార్తీక్ కంగారుపడతాడు. దీపే అసలైన వారసురాలు అని జ్యోత్స్న నిశ్చితార్థం రోజు చెప్పాలనుకున్నా ఎవరు చెప్పనివ్వలేదని దాసు అంటాడు. ఆ తర్వాత ఏమైందో గుర్తులేదని చెప్తాడు.

నువ్వు చెప్పేది నమ్మలేకపోతున్నా.. దీప పెద్ద మామయ్య కూతురు ఏంటి.. జ్యోత్స్న నీ కూతురు ఏంటని కార్తీక్ ఆశ్చర్యంగా అంటాడు. ఇవన్నీ పారిజాతం అమ్మమ్మకు తెలుసు కదా అని అడుగుతాడు. లేదు.. దీపే అసలైన వారసురాలు అనే విషయం నాకు, జ్యోత్స్నకు మాత్రమే తెలుసంటాడు దాసు. దీపే అసలైన వారసురాలని తెలిస్తే మా అమ్మకు, జ్యోత్స్నకు నష్టమే, కాబట్టి వాళ్లు దీపను చంపే ప్రయత్నం చేయవచ్చు అల్లుడు అని కార్తీక్‍తో దాసు అంటాడు. లేకపోతే మా అమ్మకు తెలియకుండా జ్యోత్స్న ఒక్కటే ఈ పని చేసి ఉండొచ్చని అంచనా వేస్తాడు. ఎందుకంటే జ్యోత్స్నను మా అమ్మ అలా తయారు చేసిందని, మనుషుల ప్రాణాలు తనకు లెక్కలేదని అంటాడు. కన్నతండ్రినైన నన్నే చంపాలనుకుంది.. నా అనుమానం ఏంటంటే దశరథ్ అన్నయ్యకు బుల్లెట్ తగిలేందుకు కూడా నా కూతురే (జ్యోత్స్న) కారణం అయి ఉండాలని దాసు చెప్తాడు. దీపను చంపాలనుకున్నది నా కూతురే అయి ఉండాలని అనుమానిస్తాడు. ఇంత జరిగిన తర్వాత కూడా మామూలుగా ఉంటే ఎవరికి ఏ రూపంలో ప్రమాదం వస్తుందో తెలియదని అంటాడు. ఎవరికి ఏమి కాకుండా ఉండాలంటే నిజం చెప్పేయాలని, తన తల్లికి, జ్యోత్స్నకు గట్టిగా బుద్ది చెప్పాలని దాసు అంటాడు. దీపే నీ అసలైన కూతురు అని దశరథ్‍కు చెప్పేస్తాను.. వెళదాం పదా అని దాసు అంటాడు.

చెప్పగానే వాళ్లు నమ్ముతారని అనుకుంటున్నావా.. ఈ మధ్యే నా మీద వారికి నమ్మకం పోయింది. నీపై ముందు నుంచి లేదు. నువ్వు చెప్పగానే జ్యోత్స్న ఒప్పుకుంటుందా. పారిజాతం అమ్మమ్మ నిజాలు చెబుతుందా అని కార్తీక్ అంటాడు. ఒప్పిస్తానని దాసు అరుస్తాడు. ఇంటి వారసురాలి విషయాన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత చెప్తే నమ్ముతారా.. ఆధారాలు అడుగుతారని కార్తీక్ అంటాడు. నమ్మిస్తానని దాసు అంటాడు. ఎలా నిరూపిస్తావని కార్తీక్ అడుగుతాడు. నిజం చెప్పకపోతే కూతురని కూడా చూడనని దాసు ఆవేశంగా అంటాడు. అసలు నిన్ను గుమ్మంలోకే రానివ్వరని కార్తీక్ వారిస్తాడు. జరిగింది విన్న నాకే ఈ విషయం ఆశ్చర్యంగా ఉంది.. ఇన్నాళ్లు ఈ విషయాన్ని పారిజాతం అమ్మమ్మ మ్యానేజ్ చేసిందంటే ఎప్పుడు చెప్పినా ఎవరు నమ్ముతారని కార్తీక్ అంటాడు. మాములు గానే దీప అంటే వాళ్లకు పడదు.. అలాంటిది దీపే అసలైన వారసురాలు అంటే నీకు మతిస్థిమితం లేదని అందరు నమ్ముతున్నారు.. ఇప్పుడు నాకు కూడా మతిస్థిమితం లేదని అనుకుంటారని కార్తీక్ అంటాడు.

నిజాలు చెప్పకపోతే హత్యాయత్నాలు ఇంతటితో ఆగవని దాసు అంటాడు. ఆస్తి కోసం దశరథ్ అన్నయ్యను, సుమిత్ర వదినను, శివన్నారాయణను కూడా చంపేస్తారని జ్యోత్స్న, పారిజాతం గురించి దాసు అంటాడు. దీప విషయం వేరే వాళ్లకు తెలిసి భయపడితేనే అలా జరగుతుందని, ఈ నిజం ఇంకా బయట ఎవరికి తెలుసని కార్తీక్ అడుగుతాడు. ఇక ఎవరికి తెలియదని అంటాడు దాసు. ఈ విషయాలన్నీ ఎవరితో చెప్పకు.. మనం ఇకనుండి వాళ్ళని గమనిద్దామని దాసుతో జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి కార్తీక్ హాస్పిటల్ కి వెళ్తాడు. తరువాయి భాగంలో దీప కళ్ళు తెరిచి చూస్తుంది. ఎలా ఉన్నావని కార్తీక్ అడుగగా.. బానే ఉన్నా అన్నట్టుగా తలాడిస్తుంది దీప. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.