English | Telugu

నన్ను వాడుకుని ఓవర్ నైట్ జంప్ ఐపోయాడు

కాకమ్మ కథలు సీజన్ 2 బాగా ఫన్నీగా సాగుతోంది. ఫస్ట్ ఎపిసోడ్ కి దీపికా - చెఫ్ సంజయ్ తుమ్మల వచ్చారు. ఎపిసోడ్ 2 కి శేఖర్ మాష్టర్ - ముమైత్ ఖాన్ వచ్చారు. ఇప్పుడు ఎపిసోడ్ 3 సాకేత్ కొమాండూరి - పర్ణికని తీసుకొచ్చింది. వీళ్ళు సింగర్స్. వీళ్ళతో రిలీజ్ ఐన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో సాకేత్ ని కొన్ని ప్రశ్నలు అడిగింది హోస్ట్ తేజస్విని మడివాడ. సింగర్ సాకేత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఇప్పుడు కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ షోలో కూడా చేస్తున్నాడు. చాలా ఫన్నీగ ఉంటాడు. అలాగే కామెడీ యాంగిల్ కూడా ఎక్కువగా.

ఐతే ఇందులో తేజు కొన్ని ప్రశ్నలు వేసింది సాకేత్ ని. "నీ లైఫ్ లో లోపాయింట్ గురించి చెప్పు" అని అడిగేసరికి. "చాలా నమ్మిన ఒక వ్యక్తి సొంత తమ్ముడిలా చూసుకున్న ఒక వ్యక్తి ఓవర్ నైట్ జంప్ ఐపోయాడు. ఇంకా చెప్పాలంటే అతను నన్ను వాడుకున్నాడు." అదే ప్రశ్నకు పర్ణిక కూడా రియాక్ట్ అయ్యింది.."తన ప్రెగ్నెన్సీ టైంలో తన వాయిస్ ని కూడా కోల్పోవాల్సి వచ్చింది అని అప్పుడు చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని చెప్పింది...చాలా ట్రెయిట్మెంట్స్ కూడా తీసుకున్నాను అని అంది". ఆ తర్వాత కొన్ని కొంటె ప్రశ్నలు అడిగింది.."పాటలు తక్కువ మాటలు ఎక్కువ" అని ఎవరిని చూస్తే అనిపిస్తుంది" అని పర్ణికను అడిగింది.."సాకేత్" అని ఆన్సర్ ఇచ్చింది. "స్వరం తక్కువ సోకులెక్కువ" ఎవరు అని సాకేత్ ని అడిగింది. "రేవంత్" అని చెప్పాడు. "ఏ హీరోయిన్ తో వీడియో సాంగ్ లో చేయాలనిపిస్తుంది" అని అడిగింది. దానికి సాకేత్ "తమన్నా" అని చెప్పాడు. "మోస్ట్ ఓవర్ రేటెడ్ సింగర్ ఎవరని నువ్వు అనుకుంటున్నావు" అని అడిగింది. "సిద్ శ్రీరామ్" అని చెప్పాడు సాకేత్.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.