English | Telugu

వాడు మగాడని తెలియాలిగా ముందు...


కాకమ్మ కథలు నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి గెస్టులుగా నయని పావని, శ్వేతా నాయుడు వచ్చారు. "మమ్మల్ని గారు అనడానికి మేము ఇంకా 30s లోకి రాలేదు." అని చెప్పారు. ఇక హోస్ట్ ఐతే కొన్ని వర్డ్స్ ఇచ్చి స్టోరీ చెప్పమంది. ఐతే వాళ్ళు "6 ఇంచెస్, అబ్బాయి, నైస్ పెర్ఫ్యూమ్ స్మెల్ తో వచ్చాడు తర్వాత లేచి చూస్తే ఒక కల.." అంటూ చెప్పుకొచ్చారు. జీవితంలో ఒక డార్కెస్ట్ టైం ఏంటి అని అడిగేసరికి..."చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు...కానీ ఎవరూ ఆ టైములో నాకు సపోర్ట్ చేయలేదు. బాధగా అనిపిస్తే బాధపడు..ఆ పరిస్థితి నన్ను చాలా మార్చేసింది. నేను ఎవరినైనా హగ్ చేసుకోవడం మానేసాను.

రెండేళ్ల క్రితం అమ్మకు యాక్సిడెంట్ అయ్యి రెండు కళ్ళు బాగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఆమె ఒక పెంగ్విన్ లా నడుస్తూ ఉంటుంది. డోర్ తెరవాలంటే చిన్నారి వెళ్లి డోర్ తెరవ్వా అంటుంది. నాకు చాల చాలా బాధగా ఉంటుంది." అని చెప్పింది శ్వేతా నాయుడు. "శ్వేతా సిద్దార్థ్ అయ్యి ఉంటె ఎం చేసేది" అని హోస్ట్ అడిగింది. "ఫిమేల్ గొంతులో పాడేదాన్ని" అని చెప్పింది. "పావని పవన్ అయ్యుంటే ఎం చేసేవాడు" అని అడిగింది హోస్ట్. 20 మంది అమ్మాయిల్ని ఒకేసారి పడేసేవాడిని" అని చెప్పింది. "లివ్ ఇన్ ఆర్ మ్యారేజ్" అని హోస్ట్ అడిగింది "లివ్ ఇన్ బిఫోర్ మ్యారేజ్" అని చెప్పింది శ్వేతా నాయుడు. "ఫస్ట్ లివ్ ఇన్ ఎక్స్పెరిమెంట్ తర్వాత పెళ్లి" అని చెప్పింది హోస్ట్. "ముందు వాడు మగాడు అని తెలియాలిగా అందుకే లివ్ ఇన్" అని ఆన్సర్ ఇచ్చింది శ్వేతా. నయని పావని, శ్వేతా నాయుడు ఇద్దరూ కొంత కాలం క్రితం వరకు బుల్లితెర మీద కనిపించే వాళ్ళు కానీ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఎక్కడ కనిపించడం లేదు. అలాంటి వాళ్లిద్దరూ ఎన్నో విషయాలను ఈ షోలో షేర్ చేసుకున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.