English | Telugu

నాగ్‌ కంటే తార‌క్‌కు బెట‌ర్ రేటింగ్‌!

జూనియ‌ర్ ఎన్టీఆర్‌ రెండోసారి బుల్లితెర‌పై హోస్ట్‌గా క‌నిపిస్తున్నారు. 'బిగ్ బాస్' సీజ‌న్ 1కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం ద్వారా తార‌క్ టెలివిజ‌న్ తెర‌పై అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. ఆయ‌న హోస్ట్‌గా చేయ‌డంతో 'బిగ్ బాస్' ప్రారంభ సీజ‌న్ సూప‌ర్ హిట్ట‌యింది. ఇప్పుడు రెండోసారి 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' గేమ్ షో ద్వారా ఆయ‌న టీవీ తెర‌పై ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నారు. జెమిని టీవీలో ప్ర‌సార‌మ‌వుతున్న ఈ షో క‌ర్టెన్ రైజ‌ర్ ఎపిసోడ్‌కు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ గెస్ట్ కంటెస్టెంట్‌గా వ‌చ్చారు.

'ఆర్ఆర్ఆర్' కో-స్టార్స్ ఇలా హోస్ట్ అండ్ కంటెస్టెంట్‌గా ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో ఇద్ద‌రి ఫ్యాన్స్‌తో పాటు వ్యూయ‌ర్స్‌కు కూడా క‌న్నుల పండ‌గ‌గా మారింది. లేటెస్ట్‌గా ఈ షో రేటింగ్స్ వ‌చ్చాయి. క‌ర్టెన్ రైజ‌ర్ వీక్ష‌కుల‌కు అమితంగా ఆక‌ట్టుకుంద‌ని దానికి ల‌భించిన 11.4 టీఆర్పీ తెలియ‌జేసింది. గ‌తంలో 2014లో 'మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు'కు నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన‌ప్పుడు ఫ‌స్ట్ ఎపిసోడ్‌కు 9.7 టీఆర్పీ వ‌చ్చింది. అంటే ఇప్పుడు 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు'కు తార‌క్ ఇచ్చిన ఓపెనింగ్ అదిరింద‌న్న మాటే.

జూనియ‌ర్ ఎన్టీఆర్ మ్యాజిక్ బాగా ప‌నిచేయ‌డంతో జెమిని టీవీ ఓవ‌రాల్ రేటింగ్ కూడా ఒక్క‌సారిగా 290 జీబీఆర్ నుంచి 400 జీబీఆర్‌కు పెరిగింది. దీంతో నిర్వాహ‌కులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. రానున్న రోజుల్లో 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు'కు వీక్ష‌కాద‌ర‌ణ మ‌రింత‌గా పెరుగుతుంద‌ని వారు ఆశిస్తున్నారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.