English | Telugu

నాగ్‌ కంటే తార‌క్‌కు బెట‌ర్ రేటింగ్‌!

జూనియ‌ర్ ఎన్టీఆర్‌ రెండోసారి బుల్లితెర‌పై హోస్ట్‌గా క‌నిపిస్తున్నారు. 'బిగ్ బాస్' సీజ‌న్ 1కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం ద్వారా తార‌క్ టెలివిజ‌న్ తెర‌పై అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. ఆయ‌న హోస్ట్‌గా చేయ‌డంతో 'బిగ్ బాస్' ప్రారంభ సీజ‌న్ సూప‌ర్ హిట్ట‌యింది. ఇప్పుడు రెండోసారి 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' గేమ్ షో ద్వారా ఆయ‌న టీవీ తెర‌పై ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నారు. జెమిని టీవీలో ప్ర‌సార‌మ‌వుతున్న ఈ షో క‌ర్టెన్ రైజ‌ర్ ఎపిసోడ్‌కు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ గెస్ట్ కంటెస్టెంట్‌గా వ‌చ్చారు.

'ఆర్ఆర్ఆర్' కో-స్టార్స్ ఇలా హోస్ట్ అండ్ కంటెస్టెంట్‌గా ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో ఇద్ద‌రి ఫ్యాన్స్‌తో పాటు వ్యూయ‌ర్స్‌కు కూడా క‌న్నుల పండ‌గ‌గా మారింది. లేటెస్ట్‌గా ఈ షో రేటింగ్స్ వ‌చ్చాయి. క‌ర్టెన్ రైజ‌ర్ వీక్ష‌కుల‌కు అమితంగా ఆక‌ట్టుకుంద‌ని దానికి ల‌భించిన 11.4 టీఆర్పీ తెలియ‌జేసింది. గ‌తంలో 2014లో 'మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు'కు నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన‌ప్పుడు ఫ‌స్ట్ ఎపిసోడ్‌కు 9.7 టీఆర్పీ వ‌చ్చింది. అంటే ఇప్పుడు 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు'కు తార‌క్ ఇచ్చిన ఓపెనింగ్ అదిరింద‌న్న మాటే.

జూనియ‌ర్ ఎన్టీఆర్ మ్యాజిక్ బాగా ప‌నిచేయ‌డంతో జెమిని టీవీ ఓవ‌రాల్ రేటింగ్ కూడా ఒక్క‌సారిగా 290 జీబీఆర్ నుంచి 400 జీబీఆర్‌కు పెరిగింది. దీంతో నిర్వాహ‌కులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. రానున్న రోజుల్లో 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు'కు వీక్ష‌కాద‌ర‌ణ మ‌రింత‌గా పెరుగుతుంద‌ని వారు ఆశిస్తున్నారు.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.