English | Telugu

పెళ్లికి ముందు పిల్లలు పుట్టరని డాక్ట‌ర్లు చెప్పారు.. రోజా భావోద్వేగం!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విజయవంతమైన హీరోయిన్లలో రోజా ఒకరు. కథానాయికగా వెండితెరపై ఓ వెలుగు వెలిగిన రోజా, ప్రస్తుతం 'జబర్దస్త్'తో సహా ఇతర కార్యక్రమాల ద్వారా బుల్లితెర ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. రోజా దగ్గర బోలెడు డబ్బులు ఉన్నాయని చాలామంది అనుకుంటారు. ఇప్పుడు రోజా దగ్గర డబ్బులు ఉండి ఉండవచ్చు. అయితే కథానాయికగా కెరీర్ ప్రారంభించినప్పటి నుండి పదేళ్ల పాటు కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ అప్పులు కట్టడానికి సరిపోయాయని తాజాగా బయటపెట్టారు.

"నేను 1991లో ఇండస్ట్రీకి వచ్చాను. 2002 వరకూ కష్టపడినది మొత్తం అప్పులు కట్టాను" అని వినాయక చవితి సందర్భంగా త్వరలో ఈటీవీలో ప్రసారం కానున్న 'ఊరిలో వినాయకుడు' స్పెషల్ ఈవెంట్ లో చెప్పారు. ఈ సంగతి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె చెబుతుంటే ఇంద్రజ, పూర్ణ ఎమోషనల్ అయ్యారు. ఇద్ద‌రూ రోజా దగ్గరకు వెళ్లి ఓదార్చారు.

పెళ్లి చేసుకునే ముందు తనకు పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పారని... అయితే, ఏడాదిలో ప్రెగ్నెన్సీ వచ్చి అన్షు పుట్టిందని రోజా తెలిపారు. అందుకే, తనకు కుమార్తె అన్షు అంటే చాలా చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. 'ఊరిలో వినాయకుడు' కార్యక్రమానికి రోజా కుమార్తె, కుమారుడు వచ్చారు. అలాగే, హీరో శ్రీకాంత్ కూడా సందడి చేశారు.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.