English | Telugu

పెళ్లికి ముందు పిల్లలు పుట్టరని డాక్ట‌ర్లు చెప్పారు.. రోజా భావోద్వేగం!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విజయవంతమైన హీరోయిన్లలో రోజా ఒకరు. కథానాయికగా వెండితెరపై ఓ వెలుగు వెలిగిన రోజా, ప్రస్తుతం 'జబర్దస్త్'తో సహా ఇతర కార్యక్రమాల ద్వారా బుల్లితెర ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. రోజా దగ్గర బోలెడు డబ్బులు ఉన్నాయని చాలామంది అనుకుంటారు. ఇప్పుడు రోజా దగ్గర డబ్బులు ఉండి ఉండవచ్చు. అయితే కథానాయికగా కెరీర్ ప్రారంభించినప్పటి నుండి పదేళ్ల పాటు కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ అప్పులు కట్టడానికి సరిపోయాయని తాజాగా బయటపెట్టారు.

"నేను 1991లో ఇండస్ట్రీకి వచ్చాను. 2002 వరకూ కష్టపడినది మొత్తం అప్పులు కట్టాను" అని వినాయక చవితి సందర్భంగా త్వరలో ఈటీవీలో ప్రసారం కానున్న 'ఊరిలో వినాయకుడు' స్పెషల్ ఈవెంట్ లో చెప్పారు. ఈ సంగతి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె చెబుతుంటే ఇంద్రజ, పూర్ణ ఎమోషనల్ అయ్యారు. ఇద్ద‌రూ రోజా దగ్గరకు వెళ్లి ఓదార్చారు.

పెళ్లి చేసుకునే ముందు తనకు పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పారని... అయితే, ఏడాదిలో ప్రెగ్నెన్సీ వచ్చి అన్షు పుట్టిందని రోజా తెలిపారు. అందుకే, తనకు కుమార్తె అన్షు అంటే చాలా చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. 'ఊరిలో వినాయకుడు' కార్యక్రమానికి రోజా కుమార్తె, కుమారుడు వచ్చారు. అలాగే, హీరో శ్రీకాంత్ కూడా సందడి చేశారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.